థాయ్ ల్యాండ్ లో రాచకుటుంబాన్ని కించపరిచేలా ఆన్ లైన్ లో పోస్టులు పెట్టిన 63 ఏళ్ల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇలాంటి కేసులో ఇంత పెద్ద శిక్ష పడటం ఇదే తొలిసారి. వాస్తవానికి ఆమెకు తొలుత 87 ఏళ్ల శిక్ష విధించారు. కానీ ఆమె క్షమాపణ చెప్పడంతో దానిని సగానికి తగ్గించారు.
అంచన్ ప్రీర్ లెట్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగి.. రాచకుటుంబానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టారనే అంశంపై కేసు నమోదైంది. 2014 నుంచి 2015 మధ్య కాలంలో ఆమె యూట్యూబ్, ఫేస్ బుక్ లలో రాచకుటుంబానికి వ్యతిరేకంగా వీడియో, ఆడియో పోస్టులు పెట్టినట్టు అభియోగాలు నమోదయ్యాయి.
మొత్తం 29 సార్లు ఆమె ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దీంతో బ్యాంకాక్ కోర్టు ఆమెకు 43 ఏళ్ల జైలు శిక్ష విధించింది. థాయ్ ల్యాండ్ లో ఎవరైనా రాచకుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర అభియోగంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే అంచన్ కు 43 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ఈ శిక్షను ఆమె పై కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉందని అంచన్ తరపు న్యాయవాది తెలిపారు.
365545 567982Some truly amazing articles on this website , appreciate it for contribution. 930031