ఓవైపు ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరుగుతుండగా.. మరోవైపు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. సరైన ఆటతీరు లేకపోవడంతో రెండేళ్లుగా జట్టుకు దూరమైన యువీ.. తాజాగా తనకు ఎంతో ప్రాణపదమైన ఆట నుంచి తప్పుకుంటున్నట్టు భావోద్వేగంతో ప్రకటించాడు. సోమవారం ముంబైలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.
19 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు చూశానని.. జీవితంలో ఎలా ఉండాలో క్రికెటే తనకు నేర్పిందని భావోద్వేగానికి గురయ్యాడు. క్రికెట్ లో తను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు ధన్యవాదాలు చెప్పాడు. ఇక తన లక్ష్యం కేన్సర్ బాధితులకు సాయం అందించడమేనని పేర్కొన్నాడు. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన యువీ.. 2012లో ఇండ్లండ్ పై చవరి టెస్ట్, 2017లో వెస్టిండీస్ తో చివరి వన్డే, 2017లోనే ఇంగ్లండ్ పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
ధోని సారథ్యంలో భారత్ గెలుచుకున్న రెండు ప్రపంచకప్ టోర్నీల్లోనూ యువరాజ్ ముఖ్యభూమిక పోషించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ప్రపంచకప్ టోర్నీల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యూవీదే. ముఖ్యంగా తనకు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని తెలిసినా ఆటకే ప్రాధాన్యత ఇచ్చిన యువీ.. ప్రపంచకప్ ఆడి అటు బ్యాట్ తోనూ ఇటు బంతితోనూ మెరిసి భారత జట్టుకు కప్ సాధించి పెట్టాడు. కెరీర్లో మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడిన యువీ 3 సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో 1900 పరుగులు చేశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు, 52 అర్థ సెంచరీలతో 8,701 పరుగులు.. 58 టీ20 మ్యాచ్ ల్లో 8 ఆఫ్ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.
అతడో శిఖరం..
భారత క్రికెట్ జట్టుకు సంబంధించి యువీ నిస్సందేహంగా ఓ శిఖరమే. సొగసైన అతడి ఆటతీరు, ఉరకలెత్తే ఉత్సాహం అతడికి ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. చాలా సింపుల్ గా సిక్సర్లు కొట్టే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్.. బంతితో కూడా మ్యాజిక్ చేయగల సమర్థుడు. అంతేకాకుండా ఫీల్డింగ్ లో కూ చాలా చురుకుగా ఉంటూ టీమిండియా బెస్ట్ ఆల్ రౌండర్ గా రాణించాడు.
2007 టీ20 ప్రపంచ కప్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్ ను ఉతికి ఆరేసిన తీరును అభిమానులు ఎప్పటికీ మరచిపోరు. ఇక కేన్సర్ ఉందన్న విషయం తనకు తెలిసినా, 2011 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొని ఆట కోసమే పరితపించాడు. ఆ టోర్నీలో బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ కూడా రాణించి భారత జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. అలా ప్రపంచకప్ ముగిసిందో లేదో.. తనకు ప్రాణాంతక కేన్సర్ వ్యాధి ఉన్న విషయాన్ని బయటపెట్టి అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాడు.
అయితే, ఆటలో ఎలా గెలిచానో, జీవితంలోనూ గెలుస్తానని, మళ్లీ వచ్చి బ్యాట్ పట్టుకుంటానని చెప్పి అమెరికా వెళ్లాడు. చెప్పినట్టుగానే మహమ్మారి కేన్సర్ ను జయించి, తిరిగి వచ్చి పట్టుదలతో మళ్లీ జట్టులో చోటు సంపాదించాడు. అయితే, ఆ తర్వాత ఆటపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో 2017లో జట్టుకు దూరయ్యాడు. 2019లో జరిగిన ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పటికీ, అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.
377642 414671Hi my friend! I want to say that this post is remarkable, nice written and consist of approximately all significant infos. Id like to see far more posts like this . 588320
137029 248659This internet internet site is my breathing in, genuinely good layout and perfect content . 442052
187923 535118Id always want to be update on new articles on this web web site , saved to favorites ! . 289307
430709 383938You produced some decent points there. I looked on the internet for that issue and discovered most people is going together with with the internet web site. 951884