ఎంపీ అంటే ఏడు పార్లమెంట్ నియోజక వర్గాలకు ఒక పెద్ద. నియోజక వర్గంలోని రాజకీయాల కంటే కూడా రాష్ట్ర రాజకీయాల మీదనే వీరి దృష్టి ఉంటుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎలాంటి పధకాలు తీసుకురావాలి, కేంద్రం మెడలు వంచి ఎలా పనులు చేయించుకోవాలి అనే విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు.
అయితే, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎంపీలకు పెద్దగా పని ఉండటం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉన్నా, కేంద్రంలో మాత్రం ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీపై విమర్శలు చేసే అధికారం ఎంపీలకు వైకాపా ఇవ్వడం లేదు. సభలో గట్టిగా ప్రశ్నించాలన్నా కూడా విజయసాయి రెడ్డి అనుమతి తీసుకోవాలి.
రాష్ట్రానికి, ఎంపీ నియోజక వర్గానికి సంబంధించిన ఏదైనా పనుల కోసం కేంద్ర మంత్రులను కలవాలి అన్నా.. కేంద్రంలోని ఇతర నాయకులను కలవాలి అన్నా కూడా విజయసాయి రెడ్డి అనుమతి తీసుకున్నాకే కలవాలని వైకాపా పార్టీ హుకుం జారీ చేసింది.
వైకాపాకు 22 మంది మంత్రులు ఉన్నా.. పార్లమెంట్ లో సైలెంట్ గా ఉండాల్సి రావడంతో పాపం ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. ఏ విషయంలో కేంద్రంలోని పెద్దలు పలకరించినా కూడా వైకాపా ఎంపీలను అనుమానంగా చూస్తుండటంతో పాపం ఎంపీలు ఫీలవుతున్నారట. ఈ అసంతృప్తి ఇలానే కంటిన్యూ అయితే.. పార్టీ ఫిరాయించడం ఖాయంగా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
116889 602639What cell phone browser is this internet site page optimized for Internet explorer? 535488
775270 708127Specific paid google internet pages offer complete databases relating whilst individual essentials of persons although range beginning telephone number, civil drive public records, as well as criminal arrest back-ground documents. 456774