YS Viveka: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తొలినాళ్లలో ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వివేకా కుమార్తె సునీత పేర్కొన్నారు. కడప కర్నూలు ప్రాంతంలో ఇవన్నీ మామూలేనని తన సన్నిహితులు చెప్పినట్టు తెలిపారు. ఈరోజు వైయస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద సునీత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
” నాన్నను హత్య చేసిన వారు ఎవరో ప్రజలకు తెలియాలని పోరాటం చేస్తున్నాను. దర్యాప్తు సంస్థలను కొందరు ప్రభావితం చేస్తున్నారు. నేరస్తులకు శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ నా పోరాటంలో సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేస్తున్నానని నాకు కూడా తెలుసు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇలాంటి సమయంలో నేనేమీ మాట్లాడకూడదు. నా వద్ద ఏదైనా సమాచారం ఉంటే నేను విచారణ అధికారులకే అందించాలి. నాన్న హత్య కేసు విషయంలో నిజాలు బయటికి రావాలి. ఆయనను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతాను?. నాకు దేశంలోనే వ్యవస్థల మీద నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
2019 మార్చ్ 15 న పులివెందుల లోని తన నివాసంలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత ఆయన గుండెపోటుతో మరణించారని ప్రచారం జరగ్గా.. తర్వాత అది హత్య అని తేలింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆయన కుమార్తె సునీత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
200367 353101Aw, it was an really very good post. In thought I would like to set up writing related to this additionally – taking time and actual effort to create a really very good article but exactly what do I say I procrastinate alot and also no indicates manage to go done. 683043
710464 502919I got what you intend,bookmarked , really decent internet website . 978820
458099 599021Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 85861