మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి, సంచలన వ్యాఖ్యలు చేశారు.. అదీ, తన సోదరీమణులు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డిలపై.
సొంత చెల్లెళ్ళు కాకపోయినా, వివేకా కూతురు సునీత అలాగే రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంటే.. చెల్లేళ్ళే కదా అవినాష్ రెడ్డికి.! వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు షర్మిల, సునీతా రెడ్డి. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి, వాళ్ళపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
‘వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఆరోపణల బురద చల్లుతున్నారు.. ఇది సబబు కాదు. మనిషులే అయితే, మనిషి పుట్టకే అయితే.. అలాంటి ఆరోపణలు చేయరు..’ అంటూ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసేశారు కామెడీగా.!
వైఎస్ వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధాలు అంటగట్టిందెవరు.? ఇదే అవినాష్ రెడ్డి. అప్పటివరకూ, ‘వివేకం సార్..’ అంటూ బాబాయ్ వైఎస్ వివేకా గురించి చెబుతూ వచ్చిన అవినాష్ రెడ్డి, ఎప్పుడైతే ఈ కేసులో అవినాష్ రెడ్డిని అనుమానించడం మొదలు పెట్టిందో, వెంటనే ప్లేటు ఫిరాయించేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి, మతం మార్చుకున్నారనీ, ముస్లిం మహిళను పెళ్ళాడి, లేటు వయసులో ఆమె ద్వారా ఓ బిడ్డకు తండ్రయ్యారనీ అవినాష్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. బాబాయ్ మీద అలాంటి ఆరోపణలు చేసినప్పుడు బహుశా అవినాష్ రెడ్డికి ‘మనిషి పుట్టక’ గురించి గుర్తుకు రాలేదేమో.!
కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమెకు అండగా నిలిచారు సునీతా రెడ్డి. తన కుమార్తెను ఇటీవల అశీర్వదించి పంపారు వైఎస్ విజయమ్మ.!
వైఎస్ కుటుంబంలో ఇప్పుడు అవినాష్ దాదాపు ఒంటరి. ఆ అవినాష్ రెడ్డికి జగన్ మాత్రమే అండగా నిలబడ్డారు. జగన్ అలా అవినాష్ వెంట మద్దతుగా వుండడాన్ని షర్మిల, సునీతా రెడ్డి తప్పు పడుతున్న సంగతి తెలిసిందే.