ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి బహుశా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఎందుకంటే, రాజధాని మార్పు దిశగా మంత్రి బొత్స సత్యనారాయణ సంకేతాలు అలా వున్నాయి. అయితే, ప్రభుత్వం తరఫున ఇంతవరకు అధికారిక ప్రకటన ఈ అంశంపై రాలేదనుకోండి. అది వేరే సంగతి. అయినాగానీ, ప్రభుత్వం తలచుకుంటే రాజధానిని మార్చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి, రాజధాని ఒకవేళ మార్చాల్సి వస్తే, కొత్త రాజధాని ఎక్కడ వుంటుంది.? టీడీపీ నేతలు చేస్తున్న ఎద్దేవా ప్రకారం, కడప జిల్లా ఇడుపులపాయకు రాజధాని తరలిపోతుందట.
మరోపక్క మాజీ ఎంపీ చింతా మోహన్, తిరుపతిని రాజధానిగా చేయాలనంటున్నారు. ‘అమరావతి మీద కుట్ర జరుగుతోంది.. రాజధాని బహుశా దోనకొండకు తరలి వెళ్ళబోతోంది..’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా వుంటే, ఉత్తరాంధ్ర ప్రజానీకం విశాఖ కేంద్రంగా రాజధాని వుండాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కర్నూలు రాజధానిగా వుండేది గనుక, అక్కడికే రాజధానిని తరలించాలంటూ కర్నూలు ప్రజానీకం కోరుతుండడం గమనార్హం. నిజానికి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న అతి పెద్ద నగరాల్లో విశాఖపట్నందే మొదటి ప్లేస్.
హైద్రాబాద్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నమే అతి పెద్ద నగరంగా రికార్డులకెక్కింది. కానీ, విశాఖకు కొన్ని ప్రతికూలతలున్నాయన్నది గతంలో చంద్రబాబు సర్కార్ చేసిన వాదన. ఆ సమయంలోనే హుద్హుద్ తుపాను రావడం, టీడీపీ వాదనకు మరింత బలాన్నిచ్చింది. నిజానికి ప్రకృతి విపత్తుల నుంచి ఏ ప్రాంతమూ అతీతం కాదు. ఇప్పుడు కృష్ణా నదికి వరదలొచ్చాయి కాబట్టి, పక్కనే వున్న అమరావతి రాజధాని ప్రాంతంగా వుండకూడదన్న వాదనా సరైనది కాదు.
మరీ మొండిగా వైఎస్ జగన్, రాజధానిని ఇడుపులపాయకు మార్చేస్తారని ఎవరైనా అనాలనుకున్నా, అది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమే అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు విషయంలో వైఎస్ జగన్ ఖచ్చితమైన అవగాహనతో వున్నారు. చంద్రబాబు పేరు ఎక్కడా కనబడనీయకూడదనే పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఆ కారణంగానే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది. రాజధాని అమరావతి విషయంలోనూ వైఎస్ జగన్ అంతకు మించిన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదన్నది నిర్వివాదాంశం.
610630 927842Man you legend. return see my internet site, you ought to get pleasure from it. 571570
850925 737627I recognize there is undoubtedly a fantastic deal of spam on this weblog. Do you want aid cleansing them up? I may possibly support in between classes! 20091