అప్పట్లో చంద్రన్న కానుక.. ఇప్పుడేమో జగనన్న కానుక.! ఇవేన్నా పప్పు బెల్లం వ్యవహారమా.? వేల కోట్ల, లక్షల కోట్ల వ్యవహారం. అప్పులేమో లక్షల కోట్లు.. వాటిటో పాలకుల పబ్లిసిటీ స్టంట్లు. జనాలు వెర్రి వెంగళప్పలనే భ్రమల్లో వున్న రాజకీయ నాయకులకు మబ్బులు విడిపోతున్నాయ్.!
గడప గడపకీ వైఎస్సార్సీపీ.. అంటూ వైసీపీ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా వైసీపీ నేతలంతా జనం బాట పట్టారు. జనం దగ్గరకు వెళుతున్నారు. కానీ, గడప గడపకీ నిలదీతలు ఎదురవుతున్నాయ్.
‘పెన్షన్ ఎవరిస్తున్నారు.?’ అని ఓ చోట ఓ మంత్రిగారు, లబ్దిదారుల్ని అడిగితే, ‘వాలంటీర్ ఇస్తున్నాడు..’ అని సమాధానం వచ్చింది. దాంతో, సదరు మంత్రిగారికి ఒళ్ళు మండిపోయింది. ‘మధ్యాహ్నం వాలంటీర్లకు, అధికారులకు క్లాస్ తీసుకోవాలి.. అప్పుడేమో చంద్రన్న ఇచ్చాడంటారు.. ఇప్పుడేమో జగనన్న ఇచ్చాడని చెప్పకుండా వాలంటీర్లు ఇచ్చారంటారా.?’ అని మంత్రి రుసరుసలాడటంతో, జనం విస్తుపోయారు.
‘అప్పుడైనా, ఇప్పుడైనా.. ఎవరు అధికారంలో వున్నా, మా సొమ్ములే కదా మాకు ఇస్తున్నారు.? మా పేరుతో అప్పులు చేసి, వాటిని మాకు పంచుతున్నట్లు కనిపిస్తూ, మీరు పబ్లిసిటీ స్టంట్లు చేస్తారా.?’ అని జనం నిలదీసే సరికి, అధికార పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది.
‘మేం రాష్ట్రాన్ని ఉద్ధరించేశాం.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేస్తున్నాం..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీర్ఘాలు తీస్తోంటే, ‘నువ్వు ఇచ్చదేంటి.? అది మా సొమ్ము..’ అని జనం అంటున్నారంటే, ఇంతకన్నా ప్రజా వ్యతిరేకత ఇంకేముంటుంది.?
రాష్ట్రానికి పప్పూ బెల్లం పథకాలు కాదు కావాల్సింది.. అభివృద్ధి. ఆ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్నదే లెక్క.! సంక్షేమ పథకాలంటారా, ఈరోజు పెన్షన్ రెండున్నర వేలు ఇస్తే, రేప్పొద్దున్న అది మూడు వేలు అవుతుందో, నాలుగు వేలు అవుతుందో.. ఎవరిచ్చినా, అది ప్రజల సొమ్మే.!
753236 498334I truly appreciate this post. Ive been searching all more than for this! Thank goodness I found it on Bing. Youve made my day! Thank you again.. 734560
163909 312623Some truly superb articles on this internet website , thankyou for contribution. 354669