ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. కన్న పిల్లలను కూడా దూరం ఉంచాల్సిన పరిస్థితి. కరోనా నిర్థారణ అయితే పిల్లలకు దూరంగా ఉండటంతో పాటు మొత్తం సమాజానికి దూరం అవుతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో కరోనా వచ్చిన తల్లి వారి పసి పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎలాంటి ప్రమాదం లేదు అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. తల్లి పాలతో కరోనా వైరస్ రాదని వారు నిర్థారించారు. తల్లికి కరోనా ఉంటే ఆ తల్లి పాల ద్వారా బిడ్డకు కరోనా వస్తుందనే ఆందోళన పడనక్కర్లేదని వారు ప్రకటించారు.
కరోనా సోకిన తల్లులు చేతులకు గ్లౌజ్ మరియు ముక్కు మరియు మూతికి మాస్క్ ధరించి తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చు అన్నారు. పిల్లల విషయంలో తల్లులు జాగ్రత్తలు పాటిస్తూ పాలు ఇవ్వడం వల్ల వారు కరోనా కు దూరం ఉంటారు. కరోనా ఉన్న వారు కూడా బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులకు తమ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వొచ్చు అంటున్నారు. ఆ పాలను శాస్త్రీయ పద్దతిలో శుద్ది చేసి భద్ర పర్చుతారు. కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదని కరోనా భయం అస్సలు ఉండదని అంటున్నారు. పిల్లలకు కరోనా భయంతో తల్లులు పాలు ఇవ్వడం లేదని తెలిసి డబ్ల్యూహెచ్ఓ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
849267 458368I need to have to admit that that is one great insight. It surely gives a company the opportunity to have in about the ground floor and genuinely take part in making a thing particular and tailored to their needs. 656226