మాజీ మంత్రి, బొత్స రాజకీయ గురువు పునుమత్స సాంబశివరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో వైజాగ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్లుగా వైధ్యులు ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఎనిమిది సార్లు చేయడంతో పాటు మంత్రిగా కూడా చేసిన పెనుమత్స ప్రస్తుతం వైకాపాలో ఉన్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు.
త్వరలో పెనుమత్సకు జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇవ్వడం ఖాయం అనుకున్నారు. కొన్ని రోజుల క్రితం జగన్ ను ఈ విషయమై ఆయన కలిశారు. కరోనా పరిస్థితుల కారణంగా నామినేటెడ్ పదవులు ఏమీ ప్రస్తుతంకు ఇవ్వడం లేదు. దాంతో పెనుమత్సకు నిరాశ ఎదురయ్యింది. ఈ సమయంలోనే ఆయన అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన మృతి పట్ల వైకాపా నాయకులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పెనమత్స మృతిపై సంతాపం ప్రకటించారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా పెనుమత్సను పేర్కొంటూ ఉంటారు.
425162 912455Soon after study some of the weblog posts in your website now, and i genuinely such as your technique for blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls look into my internet internet site likewise and make me aware what you consider. 158181