Switch to English

వైఎస్‌ జగన్‌, బీజేపీని ‘సవాల్‌’ చేయగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వాయిదా పడటానికి కారణం ఎవరు.? రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెబుతున్నదాన్ని బట్టి, కరోనా వైరస్‌ వల్లనే స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ, అధికార వైఎస్సార్సీపీ వాదన ఇంకోలా వుంది. చంద్రబాబు కుట్రతోనే స్థానిక ఎన్నికలు ఆగిపోయాయని వైసీపీ అంటోంది.

కరోనా వైరస్‌ సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలో అసలు స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నడవడంలేదన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి చెప్పినదాన్ని బట్టి చూసినా, 45 చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. వాస్తవ కోణంలో చూస్తే, పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి.

వైసీపీ కార్యకర్తలు, చాలా చోట్ల టీడీపీగానీ, జనసేనగానీ, బీజేపీగానీ, వామపక్షాలుగానీ నామినేషన్లు వేయకుండా చేశారు. మహిళలని కూడా చూడకుండా అభ్యర్థుపై దాడులకు తెగబడ్డారు. ఏకంగా ఓ న్యాయవాది నెత్తి పగలగొట్టేశారు వైసీపీ కార్యకర్తలు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇలా పెట్రేగిపోతోంటే, ముఖ్యమంత్రి ‘చెదురుమదురు సంఘటనలు’ అని లైట్‌ తీసుకోవడమేంటి.?

అసలు ఎన్నికలు సజావుగా సాగడంలేదు.. తక్షణం ఎన్నికలు నిలిపేయాలంటూ బీజేపీ నేతలు నినదించారు. కానీ, ఆ దిశగా ముఖ్యమంత్రి నుంచిగానీ, అధికార వైసీపీ ముఖ్య నేతల నుంచిగానీ బీజేపీ మీద ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీద మాత్రం ‘చంద్రబాబు తొత్తు’ అనే విమర్శలు చేస్తున్నారు. ఏం, అదే ‘తొత్తు’ అన్న పదాన్ని, ప్రధాన మంత్రి మీదనో, బీజేపీ జాతీయ అధ్యక్షుడి మీదనో ఎందుకు ప్రయోగించడంలేదు.? అలా ప్రయోగిస్తే, ఆ తర్వాత ఏం జరుగుతుందో వైసీపీ నేతలకు బాగా తెలుసు.

నామినేషన్లు వేసే అవకాశం రాజకీయ పార్టీలకు లేనప్పుడు, అసలు అది ఎన్నిక ఎలా అవుతుంది.? ‘టీడీపీకి అభ్యర్థులే దొరకడంలేదు..’ అని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో నిజమెంతో ఆ పార్టీ నేతలకే బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వ స్థాయి అధికారులతో చర్చలు జరిపిన తర్వాతనే, ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించిన దరిమిలా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ‘చేవ’ వుంటే, ‘చేతనైతే’, కేంద్రాన్ని నిలదీయాలి. కానీ, అలా ప్రశ్నించే ధైర్యం ఆయనకుందా.? కరోనా వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదు, పారాసిటమాల్ – బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని ప్రధానికి వైఎస్ జగన్ సవాల్ విసిరే పరిస్థితి వుందా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...