శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్లో ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెంది పలువురు గాయాలపాలయిన విషయం తెల్సిందే. లైకా ప్రొడక్షన్స్ వారితో పాటు పలువురిపై కేసు నమోదు అయ్యింది. విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కమల్ హాసన్తో పాటు శంకర్ ఇంకా హీరోయిన్ కాజల్కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపిన పోలీసులు మళ్లీ మళ్లీ విచారణకు పిలుస్తున్నారట.
పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కమల్ హాసన్ వారిపై హైకోర్టుకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. విచారణ పేరుతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అంటూ అన్నారు. పోలీసులు చేసిన విచారణ ఏమీ లేకున్నా పదే పదే పిలుస్తూ మా సమయంను వృదా చేస్తూ వేదిస్తున్నారు అంటూ హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినా పదే పదే విచారణ అంటూ విసిగిస్తున్నారని కమల్ కోర్టుకు తెలియజేశాడు.
తాను ఒక సెలబ్రెటీ అవ్వడం వల్ల కేసు విచారణకు పదే పదే హాజరు అవ్వడం సాధ్యం కావడం లేదని.. కొద్ది సమయం విచారణ కోసం నన్ను పిలవడం వల్ల అన్ని విధాలుగా నష్టాలు అంటూ కమల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కమల్ వేసిన పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరు వర్గాల వారి వాదనలు వినబోతుంది. మరి తుది తీర్పు ఏమని వస్తుంది అనేది చూడాలి.
389970 273227Excellent job on this write-up! I genuinely like how you presented your facts and how you produced it intriguing and effortless to comprehend. Thank you. 267788
27749 639057Right after study a few of the content for your site now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls have a appear at my web site too and told me should you agree. 902628