Viral News: సోషల్ మీడియా వేదికల్లో ఎంతమంది ఫాలోవర్లు అంటే అంత గొప్ప. ఇలానే ఆలోచించాడో ఉపాధ్యాయుడు. యూట్యూబ్ చానెల్లో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా ప్రశ్నా పత్రాలనే లీక్ చేసాడు. పోలీసులకు విషయం తెలియడంతో ఉపాధ్యాయుడిని సహకరించిన భార్య, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా (Odisha)లోని రంభ ప్రాంతానికి చెందిన సమీర్.. ‘సమీర్ ఎడ్యుకేషనల్’ అనే తన యూట్యూబ్ చానెల్లో 8వ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ చేశాడు. దీనిని గుర్తించిన రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అధారిటి డైరక్టర్ మార్చి 18న సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో సమీర్ నిందితుడిగా గుర్తించారు.
మార్చి 30న ఇంటిపై దాడి చేసి ప్రశ్నాపత్రాలు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ‘ప్రో ఆన్సర్’ అనే మరో యూట్యూబ్ చానెల్లో కూడా ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేసినట్టు వెల్లడించారు. జాజ్ పూర్ లోని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు జగన్నాధ్ కర్ అతని భార్య ఈ పని చేసినట్టు తెలుసుకున్నారు. దీంతో వీరందరినీ అరెస్టు చేశారు.