సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. వంశీ పైడిపల్లి అన్నారు కానీ తర్వాత పరశురామ్ లైన్లోకి వచ్చాడు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఏ విషయం ధృవీకరించలేం.
అయితే ఇంకా అధికారిక ప్రకటన రాకుండానే ఈ ప్రాజెక్ట్ గురించి రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకు హీరోయిన్ విషయంలో పలువురి పేర్లు ఇప్పటికే హైలైట్ అయిన విషయం తెల్సిందే. అయితే ఇంకే హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు అని మహేష్ వర్గాల నుండి సంకేతాలు అందడంతో ఆ రూమర్స్ అక్కడితో ఆగిపోయాయి.
హీరోయిన్ మీద రూమర్స్ అయితే ఆగాయి కానీ తాజాగా విలన్ మీద మొదలయ్యాయి. మహేష్ – పరశురామ్ ప్రాజెక్ట్ లో విలన్ ను ఎంపిక చేసారంటూ తాజాగా ఒక రూమర్ మొదలైంది. విలక్షణ నటుడు ఉపేంద్రను పరశురామ్ అనుకుంటున్నాడని, లాక్ డౌన్ అయ్యాక స్వయంగా కలిసి ఒప్పిస్తాడని తెలుస్తోంది.
అయితే ఉపేంద్ర చాలా సెలెక్టివ్ గా ఇతర భాషా చిత్రాలు చేస్తున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ దేన్నీ ఒప్పుకోలేదు. మరి మహేష్ చిత్రానికైనా ఓకే చెబుతాడా? అసలు ఈ వార్తల్లో నిజమెంత ఉంది అన్నది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా మరో నెల రోజులు ఆగితే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
588188 5932Some genuinely marvellous work on behalf with the owner of this web website, utterly outstanding content. 821745