ఇద్దరూ పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారే. ఒకరేమో రాష్ట్ర స్థాయిలో.. ఇంకొకరు జాతీయ స్థాయిలో.. ఇద్దరూ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల్లో ముఖ్య నేతలే. ఒకరికి వయసెక్కువ, ఇంకొకరికి వయసు తక్కువ. వయసుతో పనేంటి.? పదవుల ద్వారా వచ్చిన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి కదా.! అలా పెద్దరికాన్ని నిలబెట్టుకోలేనివాళ్ళని ‘పెద్దలు’ అనలేం. ఎందుకంటే, వారి పిల్ల చేష్టలు అలా తగలడ్డాయ్.
పరిచయం అక్కర్లేని ఆ ఇద్దరు ‘పెద్దలు’ ఎవరో కాదు, విజయసాయిరెడ్డి.. నారా లోకేష్. నారా లోకేష్ని ‘పప్పు’ అని విజయసాయిరెడ్డి అంటోంటే, విజయసాయిరెడ్డిని ‘ఏ2’ అని నారా లోకేష్ అంటున్నారు. దేశాన్ని కుదిపేస్తోన్న ‘ఎన్ఆర్సి’ వ్యవహారంపై నారా లోకేష్ ఓ ట్వీటేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ గెజిట్ జారీ చేసి, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘ఎన్ఆర్సికి వ్యతిరేకం’ అని స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఆ ట్వీట్లో ప్రస్తావించారు నారా లోకేష్. అబ్బే, అది ఎన్ఆర్సికి సంబంధించిన విషయం కాదు, ఎన్పిఆర్కి సంబంధించిన వ్యవహారమని చెబుతూ, ‘పప్పు’ తెలివితేటల్ని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసేశారు.
దేశవ్యాప్తంగా దుమారం చెలరేగాక, ఇప్పుడు తీరిగ్గా కేంద్రం ‘అబ్బే, ఎన్ఆర్సికి.. ఎన్పిఆర్కీ సంబంధం లేదు’ అని చెబుతోందిగానీ, ఎన్ఆర్సికి మొదటి మెట్టు ఎన్పిఆర్.. అని గతంలోనే కేంద్రం క్లారిటీ ఇచ్చేసిందాయె. జాతీయ జన గనన (ఎన్పిఆర్), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి) మధ్య తేడాలున్న మాట వాస్తవం. కానీ, ఒకదానితో ఒకటి లింకున్న వ్యవహారాలే.
ఎన్ఆర్సిపై దుమారం రేగాక, కేంద్రం తెలివిగా ఎన్పిఆర్ని తెరపైకి తెచ్చింది. ఈ చిన్న తేడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న విజయసాయిరెడ్డికి తెలియదని ఎలా అనుకోగలం.? పైగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్లో ‘ఎన్ఆర్సి’ అంశంపై స్పష్టత వుంది. దాన్ని కాదనడానికి వీల్లేని పరిస్థితి. ‘అస్సాం మినహా..’ అని అందులో ప్రస్తావించారు. అస్సాంలో జరిగింది ఎన్నార్సీనే. లోకేష్ని ‘పప్పు’ అనడంలో రాజకీయంగా తొందరపడొచ్చేమోగానీ, జనం ‘గన్నేరు పప్పు’ అని విమర్శిస్తున్నారన్న విషయాన్ని విజయసాయిరెడ్డి మర్చిపోతే ఎలా.?
542539 433129I like this site because so a lot utile stuff on here : D. 43736