నేను విన్నాను… నేను ఉన్నాను నేను మీ అందరి వాడను… ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ రాజన్న బిడ్డను వచ్చాను అని చెప్పిన జగన్ ను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేశారు. వైకాపా తరపున ఎవరు నిలబడినా ఫ్యాన్ గాలిలో గెలిచారు. జగన్ గెలిపించాలని కాకపోయినా… బాబు చేసిన పనులు ప్రజలకు నచ్చకపోవడంతో… మరో దారిలేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జగన్ గెలిచాక..అయన ఆనందానికి అవధులు లేవు. ఆరునెల కాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అన్నారు.
ఎందుకు అనుకోవాలి ఇచ్చిన హామీలు ఎలాగోలా అమలు చేస్తూనే ఉన్నారు. కొన్ని మంచి పనులు చేశారు దానిని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ, తెలుగుదేశం పార్టీపై కోపంతో, పగతో, అమరావతిలో ఆ పార్టీ వాళ్ళు భూములు కలిగి ఉన్నారనే కోపంతో రాజధానిని అమరావతి నుంచి మార్చడం అన్నది దారుణమైన విషయం. ముంపు బూచి చూపించి మారుస్తున్నారు. వరదలు వస్తే అమరావతి మునుగుతుంది అన్నారు. కానీ, 2019 లో వచ్చిన వరదలకు కర్నూలు మునిగింది. గోదావరి జిల్లాలు మునిగాయి. కానీ, అమరావతి మాత్రం మునగలేదు. ముండుప్రాంతం అని చెప్పినా ముంపుకు గురికాలేదు.
అంతకు ముందు హుద్ హుద్ తుఫాను వచ్చింది. ఆ సమయంలో విశాఖ విలవిలలాడిపోయింది. దారుణంగా దెబ్బతిన్నది. కానీ, అమరావతి మాత్రం చెక్కుచెదరలేదు. తొణకలేదు. విశాఖ ప్రజలకు అమరావతి నుంచి ప్రజలు సహాయ సహకారాలు అందించారు. అయితే, ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని చెప్పిన తరువాత ఒక్కసారిగా ప్రజలు భగ్గుమంటున్నారు.
అందరివాడని నమ్మి జగన్ కు ఓటు వేస్తె కొందరికోసమే జగన్ పనిచేస్తున్నారని అమరావతి రైతులు వాపోతున్నారు. ఒక్క టీడీపీ కార్యకర్తలు, రైతులే కాదు, వైకాపా కార్యకర్తలు, రైతులు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఒక్కసారి చెప్తే వెయ్యిసార్లు చెప్పినట్టే అనే విధంగా ప్రవర్తించే జగన్ కు రాజధాని రైతుల మాటలు వినిపిస్తాయా అంటే కష్టమే. బెదిరిస్తే బాబైనా బెదిరిపోతాడేమోగాని, జగన్ మాత్రం కనీసం రిప్లై కూడా ఇవ్వరు.
700232 188413I truly appreciate your piece of work, Fantastic post. 618664
255329 131662You produced some decent points there. I looked on the internet for that concern and located most individuals will go together with with the web site. 612101