Ayodhya: భారతీయులు దశబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య (Ayodhya) రామమందిరం ప్రారంభం మరికొద్ది రోజుల్లో జరుగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే.. ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు భక్తి పేరుతో దొచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని వీహెచ్ పీ (VHP) ఓ ప్రకటనలో తెలిపింది.
రామాలయం ప్రారంభోత్సవం అంటూ ప్రకటనలు, పేజీలు సృష్టించి భక్తుల నుంచి నగదు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఎటువంటి క్యూర్ కోడ్స్, యూపీఐల ద్వారా నగదు బదిలీ చేయొద్దని హెచ్చరించారు. విరాళాలు సేకరించేందుకు ఎవరికీ అధికారం, అనుమతి ఇవ్వలేదని వీహెచ్ పీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఓ ఫేక్ పేజీని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులకు లేఖ రాశామని అన్నారు. రామమందిర పనులు పూర్తిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తోందని అన్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.