దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చక్కని వసూళ్లు సాధించింది. వసూళ్లకంటే ప్రధానంగా ఈ చిత్రానికి దక్కిన గౌరవం అద్భుతం. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చక్కని చిత్రంగా కొనియాడారు.
భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. “సీతారామం” చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది.” అని ట్వీట్ చేసారు వెంకయ్య నాయుడు.
అలాగే, “చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని “సీతారామం” అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు.” అని పొగడ్తల వర్షం కురిపించారు.
65257 956174Good weblog here! after reading, i decide to buy a sleeping bag ASAP 20433
762660 189829I want to thank you for the outstanding post!! I undoubtedly liked every bit of it. Ive bookmarked your internet website so I can take a appear at the latest articles you post later on. 423518
887056 539213The web site loading pace is amazing. 381023