ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నిలిచిపోయింది. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం.. రెండో డోసు వేయాల్సిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో కోవిడ్ టీకా పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పలు జిల్లాల కలెక్టర్లు స్పష్టంచేశారు. చిత్తూరు, విజయనగరం, కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వ్యాక్సిన్ వేయడం ఆగిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.5 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, రెండో డోసు వేయాల్సినవారికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో తొలి డోసు వేసే ప్రక్రియను తాత్కాలికంగా ఆపేశారు. ఒకవేళ తొలి డోసువారికి టీకాలు వేస్తే.. రెండో డోసువారికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించి ఉంటే బాగుండేదని పలువురు మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కోసం సోమవారం టీకా కేంద్రాల వద్ద బారులు తీరినవారంతా టీకా వేయడంలేదని తెలిసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు టీకా కేంద్రాల వద్ద రద్దీ నియంత్రించేందుకు అధికారులు కొత్త విధానం తీసుకురావాలని యోచిస్తున్నారు. కరోనా యోధులు, 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటినవారిగా విభజించి మూడు రకాల టోకెన్లు జారీ చేస్తారు. ఎవరికి ఎప్పుడు టీకా ఇస్తారనే వివరాలతో వారి ఇంటివద్దకే ఆశా కార్యకర్తల ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తారు.
764280 45872forty men and women that work with all the services Oasis provides, and he is actually a really busy man, he 499857
42628 291335I got what you intend, saved to my bookmarks , extremely decent website . 504479
634266 18046What a lovely weblog. Ill surely be back once more. Please preserve writing! 561462