వైఎస్ తరహాలో జగన్ వరుసగా రెండోసారి గెలుస్తారా.. లేదా అనేది చెప్పడం కష్టమని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. విశాఖలో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు డబ్బు ఇచ్చాను.. వాళ్లు నాకు ఓటు వేయాలనేది జగన్ విధానం. ఇదే క్విడ్ ప్రోకో. ఓటు వేయని వారికి పధకాలు ఇవ్వరు. ఈ తరహా గ్యాంబ్లింగ్ ఇప్పటి వరకూ ఎవరూ చేయనిది. నిధుల మళ్లింపుపై కేంద్రం దర్యాప్తు జరుగుతోంది. నిజమని తేలినా.. ప్రజలకే ఇచ్చానని చెప్తారు’.
‘రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించలేక పోతున్నారు. పోలవరాన్ని కేంద్రానికి ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రశ్నించి.. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ పని చేయడం లేదు. ఏపీలో అధికారంలోకి రాలేమని తెలిసే ఇక్కడెందుకు ఖర్చు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్లే ఏపీలో విద్యుత్ సంక్షోభం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే.. అది ఎవరికి లాభిస్తుందో చూడాల’ని అన్నారు.
98483 844893Nice blog! Only dilemma is im running Firefox on Debian, and the web site is searching slightly.. weird! Perhaps you might want to test it to see for yourself. 302362
66874 209692Id always want to be update on new content on this web site , saved to fav! . 905929
60598 551468you use a wonderful weblog here! do you want to make some invite posts on my blog? 514470