అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేవరకు తడుతూనే ఉంటుందన్నది సామెత. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈ సామెత కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది. అందివచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్న ఆ నేతలు.. అదృష్టాన్ని వదిలేసి దురదృష్టాన్ని ఎంచుకున్నారు. వారు తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం.. ఆయా నేతల రాజకీయ భవిష్యత్తునే అయోమయంలో పడేసింది. కొందరు నేతలు మాత్రం చాలా తెలివిగా వ్యవహరించి అదృష్టాన్ని ఒడిసిపట్టుకోగా.. కొంతమంది మాత్రం తమకు రాబోయే అదృష్టాన్ని చేజేతులా వదులుకుని దురదృష్టాన్ని వాటేసుకున్నారు.
ఇటీవల ఏపీలో అసెంబ్లీతోపాటు లోక్ సభకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ముందు నుంచీ పలు సర్వేలు, అధ్యయనాలు, అభిప్రాయాలూ అన్నీ కూడా వైఎస్సార్ సీపీకే అనుకూలంగా వచ్చాయి. కాస్త రాజకీయ అనుభవం ఉన్నవారు ఎవరైనా సరే క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటో అంచనా వేయగలరు. కానీ ఈ నేతలు మాత్రం తప్పుడు అంచనాలు వేసుకుని తమ రాజకీయ భవిష్యత్తుకు తామే చరమగీతం పాడుకున్నారు.
ఇలాంటివారిలో విజయవాడకు చెందిన వంగవీటి రాధాకృష్ణ, విశాఖపట్నానికి చెందిన కొణతాల రామకృష్ణ, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వంటి నేతలున్నారు. వంగవీటి రాధాకృష్ణ, గౌరు చరితారెడ్డి దంపతులు ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వంగవీటికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమే రాకపోగా, గౌరు చరిత పాణ్యం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. ఆ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన కాటసాని రాంభూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఇరువురు నేతలూ పార్టీనే నమ్ముకుని ఉంటే కచ్చితంగా ఏదో ఒక పదవి వచ్చేదని, కానీ చివరి క్షణంలో పార్టీ మారి తప్పు చేశారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
వంగవీటి రాధాకృష్ణ తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కావాలని పట్టుబట్టకుండా పార్టీ సూచించినట్టు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచో లేదా తర్వాత ఆఫర్ చేసిన మచిలీపట్నం ఎంపీగానో పోటీ చేసి ఉంటే కచ్చితంగా విజయం సాధించి ఉండేవారు. కానీ అలా చేయకుండా తొందరపాటు నిర్ణయంతో టీడీపీలో చేరి రాజకీయంగా నష్టపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక గౌరు చరితారెడ్డి దంపతులు తమకు పాణ్యం టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో వైఎస్సార్ సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడున్న పరిస్థితులను బట్టి పాణ్యం టికెట్ ఇవ్వలేనని చెప్పిన జగన్.. వారి భవిష్యత్తును తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ, గౌరు దంపతులు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీ చేరారు.
ఇక కొణతాల రామకృష్ణ కూడా అంది వచ్చిన అవకాశాన్ని కాదనుకున్నారు. తొలి నుంచీ వైఎస్సార్ సీపీలో ఉన్న ఆయనపై కొన్ని అభియోగాలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన చాలాకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్ సీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా జగన్ ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా వేయబోగా.. కొణతాల తిరస్కరించారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తే చాలని, కొత్తగా పార్టీ కండువా వేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో అవాక్కైన జగన్.. ఆయన్ను దూరం పెట్టారు. దీంతో పార్టీలో చేరే అవకాశాన్ని కొణతాల కోల్పోయారు. తద్వారా రాజకీయంగా నష్టపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
882354 327142Youre so cool! I dont suppose Ive learn something like this before. So nice to search out any person with some unique thoughts on this topic. realy thank you for starting this up. this internet web site is one thing thats required on the net, someone with a bit of originality. useful job for bringing something new to the internet! 781214
538509 341140I like this internet web site because so significantly utile stuff on here : D. 889187