ఇప్పటికే హెచ్1బీ, గ్రీన్ కార్డులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారతీయులపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులకు విద్యార్ధులు హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంతో భారతీయ విద్యార్ధులపై పిడుగు పడినట్టైంది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని అక్కడి విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయి. వీటిలో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు హెచ్చరిక చేసింది. ‘వీరికి వీసాలు జారీ చేయం. కొత్తగా వచ్చే విద్యార్ధులను దేశంలోకి అనుమతించం. నాన్ ఇమ్మిగ్రెంట్, ఎఫ్1, ఎం1 వీసాలపై ఉంటూ ఆన్ లైన్ క్లాసులకు హజరయ్యేవారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంద’ని హెచ్చరిస్తున్నారు.
ఈమేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఓ ప్రకటన జారీ చేసింది. అమెరికాలో ఉండాలనుకుంటే డైరక్ట్ క్లాసులు నిర్వహించే స్కూళ్లకు మారాలని సూచించింది. విద్యాసంస్థలు కూడా.. ‘ఎక్కువ మంది విద్యార్ధులు డైరక్ట్ క్లాసులకు హాజరవుతున్నారని నిరూపించాల్సి ఉంటుంద’ని కూడా ఆ ప్రకటనలో తెలిపింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అక్కడి విద్యా సంస్థలు కూడా ఇబ్బందిపడుతున్నాయి.
ట్రంప్ నిర్ణయం ఎక్కువగా భారతీయ విద్యార్దులపై ప్రభావం చూపనుంది. గణాంకాల ప్రకారం గత విద్యా సంవత్సరంలో దాదాపు 10లక్షల మంది విదేశీ విద్యార్దులు అమెరికాలో ఉన్నారు. భారత్ తో సహా కెనడా, చైనా, దక్షిణ కొరియా, సౌదీకి చెందిన విద్యార్దులే ఎక్కువ. ప్రస్తుత కరోనా సమయంలో కూడా స్కూళ్లు తెరవాలనే ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రంప్ నిర్ణయాలతో విద్యార్ధుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారని విమర్శించారు. ఈ నిర్ణయం ట్రంప్ క్రూరత్వానికి నిదర్శనమన్నారు.
534580 934263Real informative and great anatomical structure of topic material , now thats user pleasant (:. 934939
983338 684309I discovered your blog site on google and check a few of your early posts. Continue to maintain up the quite good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading a lot more from you later on! 865969