అభిమానులు, కార్యకర్తల అత్యుత్సాహం ఒక్కోసారి వారిని ఇరకాటంలో పడేస్తుంది. ఈనెల 11న జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నికైన గద్వాల్ విజయలక్ష్మిపై అభిమానంతో బ్యానర్లు కట్టిన టీఆర్ఎస్ నేతకు ఇప్పుడు ఇటువంటి అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటివలే మేయర్ గా ఎన్నికైన విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్తూ జంట నగరాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేత అతీష్ అగర్వాల్ కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో కరెంట్ స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టారు.
అయితే.. ఇవి అనధికారికంగా ఏర్పాటు చేశారు. వీటిని ఫొటోలు తీసి కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీటిని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అనధికారికంగా ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. దీంతో స్పందించిన అధికారులు అతీష్ కు లక్ష రూపాయల జరిమానా విధించారు. మిగిలిన చోట్ల బ్యానర్లను తొలగించే ఏర్పాట్లు చేశారు. విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె అనే విషయం తెలిసిందే.
851401 140836Depending on yourself to make the decisions can really be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes much more than just happening to happen. 553333
407560 800277Some times its a discomfort in the ass to read what people wrote but this internet internet site is really user friendly ! . 753492