దాదాపు దశాబ్దకాలం పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ త్రిషకు తాజాగా ఓ లక్కీ ఛాన్స్ దక్కింది. ఆ ఛాన్స్ ఏమిటో తెలుసా .. క్రేజీ దర్శకుడు మణిరత్నం సినిమాలో కీ రోల్ పోషించే పాత్ర దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న త్రిష కు ఆ తరువాత వరుస పరాజయాలతో కెరీర్ వెనకపడింది.
ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. దానికి తోడు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటే అదికాస్తా ప్లాప్ అయింది. దాంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న త్రిష .. ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లో కేవలం లేడి ఓరియెంటెడ్ సినిమాలు, భిన్నమైన కాన్సెప్ట్ లకే ఓకే చెప్పిన ఈ అమ్మడికి సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వచ్చింది.
ఈ మద్యే విజయ్ సేతుపతి తో చేసిన 96 సంచలన విజయంతో పాటు అందరి అభిమానాన్ని అందుకున్న త్రిష కోసం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో ఓ కీ రోల్ అఫర్ చేసాడట. మణిరత్నం సినిమాలో .. అదికూడా కీ రోల్ అంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే.
ఇప్పటికే జయం రవి, విక్రమ్, ఐశ్వర్య రాయ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, అమలా పాల్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్స్ నటిస్తుండగా .. అందులో త్రిష పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. మరి ఈ పాత్రతో త్రిష క్రేజ్ మరోరెంజ్ కి వెలుతుందేమో చూద్దాం !!
