సినిమాల్లో చాలా డైలాగులు ఉంటాయి… ఈరోజు మనం దేశం లోపల ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? బోర్డర్ లో ఉండేసైనికులు. బోర్డర్ లో ఉండే సైనికులు నిత్యం చలికి వణుకుతూ… ఎండకు ఎండుతూ.. ఎదురుగా శత్రువులతో పోరాటం చేస్తుంటారు. అలా అక్కడ ప్రాణాలను పణంగా పోరాటం చేస్తున్నారు కాబట్టే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంటున్నాం.
24 గంటలు రెప్ప వాల్చకుండా అశ్రద్ధ చేయకుండా పహారా కాస్తుంటారు. అలా చేస్తున్నారు కాబట్టే దేశం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం మొదట దేశ రక్షణకు, దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్మీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటోంది. దేశ రక్షణ వ్యవస్థ బలంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదా. మన రాజకీయ నాయకులు దేశాన్ని గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారు. మనపై దాడులు చేసినపుడు ఇండియన్ ఆర్తి సాహసోపేతంగా శత్రువులపై విరుచుకుపడినపుడు వారి సాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తుంటారు.
తూటాలకు నెలకొరిగితే అయ్యో పాపం అని చెప్పి మర్చిపోతాం. ఎందుకంటే ఆర్మీ కేంద్రం చేతుల్లో ఉంటుంది. వారి అవసరాలు కేంద్రం చూసుకుంటుందిని పక్కన పెడుతుంటాం. మన నాయకులు ఎవరైనా సహాయ సహకారాలు అందజేస్తున్నారా… ఒక్కసారి ఆలోచించండి. మన నాయకులు వాటికోసం వీటికోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. కానీ, ఆర్మీ సహాయనిధికి విరాళాలు ఎవరైనా ఇస్తున్నారా చెప్పండి.
ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నడుపుతూ.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారాలు అనుభవించిన వ్యక్తులు ఎవరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించరు. కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు. దేశం బోర్డర్ లో ఉండే సైనికుల గురించి ఆలోచించాడు… శత్రువులతో యుద్ధం చేసి వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఎంతమంది అండగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వమే వీరికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నది. వీరి కుటుంబాలను ఆదుకోవాలని దేశంలోని ప్రజలకు మోడీ పిలుపును ఇచ్చారు.
మనల్ని కాపాడటం కోసం దేశం బోర్డర్లో ప్రాణాలను త్యాగం చేసిన వీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇది పవన్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే పవన్ కళ్యాణ్ కేంద్ర సైనిక బోర్డుకు కోటి రూపాయల విరాళాన్ని అందించారు. సైనికుల కుటుంబాలకు ప్రజలు తమ వంతుగా విరాళాలు అందించాలని మోడీ పిలుపును ఇచ్చారు. అందులో పవన్ భాగస్వామ్యం అయ్యారు. మనం కూడా మన వంతు సహాయం చేద్దాం.
I am donating Rs1 crore to the
‘kendriya sainik board’ for the welfare our soldiers families. I will personally handover the DD to the concerned authorities in Delhi. My heartfelt gratitude to ‘PM Modiji’ for reminding our responsibility towards our Nation🙏#ArmedForcesFlagDay— Pawan Kalyan (@PawanKalyan) December 6, 2019
#ArmedForcesFlagDay pic.twitter.com/gHHizpUYa8
— Pawan Kalyan (@PawanKalyan) December 6, 2019
769748 911826Woh I like your content material , saved to bookmarks ! . 891152