Tirupathi: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అపశృతి.. రావి చెట్టు కూలి భక్తుడు మృతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,407FansLike
57,764FollowersFollow

Tirupathi: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. వందల ఏళ్ల నాటి రావిచెట్టు గురువారం సాయంత్రం ఒకసారిగా కుప్పకూలింది. ఆలయ మహా ద్వారానికి ఎదురుగా ఉన్న ఈ వృక్షం.. నిన్న కురిసిన గాలివానకి చెట్టు మొదలు రెండుగా చీలిపోయి అక్కడే ఉన్న భక్తులపై పడింది. ఈ ఘటన లో ఓ భక్తుడు మృతి చెందాడు. మరికొంతమందికి గాయాలయ్యాయి.

మృతి చెందిన వ్యక్తి కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప గా గుర్తించారు. ఆయన కుమార్తె రవళి నగరంలోని ఓ కళాశాలలో వైద్య విద్య చదువుతోంది. ఆమెను చూడటానికి గుర్రప్ప తిరుపతి వచ్చారు. అనంతరం తండ్రి, కుమార్తె ఇద్దరు కలిసి గోవిందరాజస్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా. ఒక్కసారిగా చెట్టు విరిగి గుర్రప్పపై పడింది. ఈ ఘటనలో ఆయన తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళముందే తండ్రి ప్రాణాలు వదలడం చూసిన రవళి రోదించిన తీరు అక్కడున్న భక్తులందరినీ కలచివేసింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక రుయా ఆసుపత్రిలో చేర్చారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మృతునికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు చెప్పారు.

గజరాజులు ప్రమాదాన్ని ముందే పసిగట్టాయా?

ఈ ఘటనకు కొద్దిసేపటికి ముందే వాహన సేవకు ఆలయానికి గజరాజులు వచ్చాయి. ఆలయ ఆవరణలో ఏనుగులు పెద్దగా ఘీంకారం చేస్తుండటంతో సిబ్బంది వాటిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ప్రమాదం జరిగే వరకు అవి అలాగే అరుస్తూనే ఉన్నాయి. ప్రమాదాన్ని గజరాజులు ముందే పసిగట్టి ఉంటాయని భక్తులు అంచనా వేస్తున్నారు.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితుల వద్దకు చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజయనగరం నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

తాతయ్య గుంట అమ్మవారి దర్శనంలో అనన్య నాగళ్ళ

తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దేవాలయాన్ని ప్రముఖ నటి అనన్య నాగళ్ళ శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ...

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంలో పాల్గొన్న లోకేష్ దంపతులు

మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో...