Tollywood : ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, తేజ హనుమాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రవితేజ సినిమా కూడా ఉండగా పోటీ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో వాయిదా వేయించారు. నాలుగు సినిమాల్లో సైంధవ్ తప్ప మూడు సినిమాలు కూడా మంచి వసూళ్లు నమోదు చేశాయి.
సంక్రాంతికి విడుదల అయితే అన్ని విధాలుగా బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో అప్పుడే 2025 సంక్రాంతికి సినిమాలు రెడీ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాకుండా నా సామి రంగ సినిమా యొక్క సక్సెస్ వేడుకలో వచ్చే సంక్రాంతికి వస్తాను అంటూ నాగ్ ప్రకటించాడు.
తాజాగా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే చిరంజీవి, నాగార్జున మరియు వెంకటేష్ లు 2025 సంక్రాంతికి ఫిక్స్ అయ్యారు. ఇంకా ఏడాది సమయం ఉంది కనుక అప్పటి వరకు మరి కొన్ని సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు. మరి పెద్ద హీరోల సినిమాలు కనుక ఎవరిని అయినా ఆగమని అంటారేమో చూడాలి.