జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను భద్రత బలగాలు మరియు స్థానిక పోలీసులు వరుసగా ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇటీవలే పది మందిని ఎన్కౌంటర్ చేసిన ఆర్మీ తాజాగా మరో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్లుగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఎక్కువగా కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారిని ఏరివేసేందుకు ఆర్మీ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
తాజాగా ఖుల్ చోహార్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల గురించి సమాచారం రావడంతో మెరుపు దాడి చేసిన భద్రత అధికారులు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కొందరు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. తప్పించుకున్న వారిని గాలించే కార్యక్రమం జరుగుతోంది. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో వెంటనే స్పందించిన ఆర్మీ అధికారులు ఎన్కౌంటర్ చేసినట్లుగా ప్రకటించారు. ఎదురు కాల్పుల్లో భారత భద్రత బలగాలు కూడా గాయ పడ్డట్లుగా సమాచారం.
624727 222113This is the first time I frequented your web page and up to now? I amazed with the research you made to create this particular publish extraordinary. 544137
170106 904321Just wanna remark on few general things, The website style is ideal, the subject matter is rattling excellent 754665