సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పై బంజారాహిల్స్ రోడ్ నెంబర్ రోడ్ నెం. 12లో పోలీసు కేసు నమోదు అయ్యింది. ఒక మహిళ ఆయనపై కేసు నమోదు చేసింది. తనను మోసం చేశాడు అంటూ నవ్వాడ శోభారాణి కేసు పెట్టింది. మినిస్టర్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న తన బిల్డింగ్ను నిర్మాత రామకృష్ణ లీజ్కు తీసుకున్నాడు. అందుకు గాను 40 లక్షల అడ్వాన్స్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపి నెలకు నాలుగున్నర లక్షల రెంట్ ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నాడు.
అడ్వాన్స్లో భాగంగా 30 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగిలిన 10 లక్షల రూపాయలు ఇవ్వక పోవడంతో పాటు రెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదని, దాంతో తాను ఖాళీ చేయాలంటూ చెప్పి తాళం కూడా వేసుకున్నాం. కాని ఆ తాళం పగులగొట్టి లోనికి వెళ్లారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్ కోసం ఈ భవనంను నిర్మాత రామకృష్ణ తీసుకున్నట్లుగా ఆమె పేర్కొంది.
ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకపోడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినది అంటూ రామకృష్ణ తరపు వారు అంటున్నారు. ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన తర్వాత ఇస్తామంటూ చెప్పినా కూడా ఆమె మాత్రం అంగీకరించకుండా ఇలా కేసు పెట్టింది అనేది నిర్మాత తరపు వారి వాదన. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు నిర్మాత రామకృష్ణను విచారించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
241316 875003Straight towards the point and properly written! Why cant everybody else be like this? 390401