ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్చ భారత్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా మంచి ప్రగతిని తీసుకు వచ్చింది. పరిశుభ్రత విషయంలో రాష్ట్రాలు మరియు మున్సిపాలిటీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగితే ఖచ్చితంగా ఇండియా స్వచ్చ్ గా మారుతుంది. స్వచ్చ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాంధీ జయంతి సందర్బంగా పురష్కారాలను అందిస్తూ ఉంటుంది. రాష్ట్రం, గ్రామం, మున్సిపాలిటీ ఇలా అన్ని విభాగాలకు కేంద్రం నుండి అవార్డులు ఇస్తున్నారు. ఈ ఏడాదికి గాను స్వచ్చ భారత్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
వరుసగా మూడవ సారి స్వచ్చ భారత్ అవార్డును తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న విధానం బాగుందంటూ స్వయంగా కేంద్రం మూడవ సారి ఈ అవార్డును ఇవ్వబోతుంది. ఇక జిల్లాల విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా జిల్లాలను తీసుకుంటే మూడవ స్థానంలో కరీంనగర్ జిల్లా నిలిచింది. ఈ అవార్డులను అక్టోబర్ రెండున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ఆన్ లైన్ ద్వారా అందించబోతున్నారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమంను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు.
804102 311829Thank you a good deal for giving every person an extraordinarily particular possiblity to check suggestions from here. 823199
481076 597951hi and thanks regarding the particular post ive really been searching regarding this kind of info online for sum time these days hence thanks a whole lot 79174
177285 94273cool thanks for reis posting! btw are there feeds to your weblog? Id adore to add them to my reader 815469
879563 255864Thanks for helping out, superb info . 536819