Switch to English

అందరూ నిర్దోషులే.. బాబ్రీ కూల్చివేతలో బీజేపీ నేతలకు భారీ ఊరట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పులో బీజేపీ కురువృద్దులకు భారీ ఊరట లభించింది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులేనని సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీజేపీ సీనియర్ నేత అద్వానీ సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. పథకం ప్రకారమే బాబ్రీ మసీదును కూల్చివేశారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో సీబీఐ సమర్పించిన ఆధారాలు సరిగా లేవని పేర్కొంది.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు రెచ్చగొట్టడం వల్లే కరసేవకులు మసీదు కూల్చివేశారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం 49 మందిని నిందితులుగా చేసింది. కేసు విచారణలో ఉండగానే 17 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఏకంగా 28 ఏళ్లపాటు విచారణ జరిగింది.

పథకం ప్రకారమే బీజేపీ నేతలు ఈ కుట్రకు పాల్పడ్డారని సీబీఐ వాదించగా.. రాజకీయ ప్రతీచర్యలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఈ కేసులో ఇరికించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. తాము నేరం చేశామనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. విచారణలో భాగంగా 351 మంది సాక్షులను విచారించారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30 నాటికి పూర్తిచేసి తీర్పు వెలువరించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సురేంద్ర యాదవ్ బుధవారం తీర్పు వెలువరించారు.

తీర్పు సమయంలో 32 మంది నిందితులూ కోర్టులో హాజరుకావాలని ఈనెల 16న సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, వయోభారం కారణంగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి కోర్టుకు రాలేదు. ఉమాభారతి, కల్యాణ్ సింగ్ లు కరోనాకు చికిత్స పొందుతున్నారు. వీరందరూ తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. నిందితులంతా నిర్దోషులేనంటూ తీర్పు రావడంతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు న్యాయమూర్తి సురేంద్ర యాదవ్ కు భద్రత పెంచారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...