Hanuman : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొంది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో ఇతర మూడు సినిమాలు కనిపించకుండా పోయాయి. కానీ హనుమాన్ మాత్రం సందడి కంటిన్యూ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా ఈ సినిమా ఏకంగా రూ.30.65 కోట్ల షేర్ ను దక్కించుకుంది. రూ.62.68 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను నైజాం ఏరియా నుంచి రాబట్టి అరుదైన రికార్డ్ ను హనుమాన్ దక్కించుకుంది.
మూడు వారాలు పూర్తి అయ్యేప్పటికి నైజాం ఏరియాలో ఈ సినిమాకు 15170 షోలు పడ్డాయి. ఇక 3337952 మంది ఆడియన్స్ హనుమాన్ సినిమాను చూశారు. ఈ విషయాన్ని హనుమాన్ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇతర ఏరియాల నుంచి కూడా అటు ఇటుగా ఇదే స్థాయి వసూళ్లు వస్తున్నాయట.