బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆకస్మిక మరణంపై ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆయన ఆత్మీయులు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముంబయి పోలీసులు సుశాంత్ ది ఆత్మహత్య అంటూ దాదాపుగా నిర్థారణకు వచ్చారు. ఇలాంటి సమయంలో రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారు. రియా చక్రవర్తి ఈ కేసులో ప్రధాన నింధితురాలు అంటూ బీహార్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో సుశాంత్ మాజీ ప్రియురాలు అయిన అంకితా లోఖండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ నుండి విడిపోయినా కూడా ఆయనకు ఆప్త మిత్రురాలిగా ఆమె కొనసాగుతోంది. సుశాంత్ మృతి తర్వాత దాదాపు నెల రోజులకు సోషల్ మీడియాలో అంకితా కనిపించింది. అంతకు ముందు మీడియాలో కనిపించినా మాట్లాడేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు. కొన్ని రోజుల క్రితం బీహార్ పోలీసుల ముందుకు వచ్చిన ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తాను చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్రేమ విషయంలో తాను మోసపోయానేమో అనుకుంటున్నట్లుగా చెప్పాడని అంకితా పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం.
ఇక తాజాగా సోషల్ మీడియాలో ఆమె నన్ను ఎన్నో పనులు చేయమని వారు కోరుతున్నారు. వారికి నేను నమస్కరించి చెబుతున్నాను నేను భగవంతుడు సృష్టించిన పవిత్రమైన దారిలో నడుస్తున్నాను. నా మనసు ఏది అయితే చెబుతుందో దాన్నే చేస్తాను. నన్ను కొనలేరు నన్ను అమ్మలేరు అంటూ ఆమె పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే సుశాంత్ కేసులో ఆమె నోరు మెదపకుండా ఉండేందుకు డబ్బులు ముట్ట జెప్పేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
983319 612788Yay google is my king aided me to locate this excellent internet site ! . 393619
798785 635587We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 962016