స్టార్ నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయం చేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా సాయం అవసరం అయిన వారిని గుర్తించి వారికి తన వంతు సాయంను అందిస్తున్నాడు. దాంతో సోనూ సూద్ ను అంతా కూడా రియల్ హీరో అని దేవుడు అంటూ కీర్తిస్తున్నారు. ఈ సమయంలోనే సోనూసూద్ పై ఐయామ్ నాట్ మెస్సయ్య అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంను ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా సెట్ లో ఆవిష్కరించిన విషయం తెల్సిందే.
ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బి మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా ఐ యామ్ నాట్ మెస్సయ్య బుక్ ను ఆ విష్కరించారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఈ పుస్తకం ను ఆవిష్కరించడంతో పాటు అమెజాన్ లో ఈ ఫుస్తకం అందుబాటులో ఉందంటూ చెప్పుకొచ్చాడు. సోనూసూద్ ను ఈ సందర్బంగా బిగ్ బి అభినందించడంతో పాటు అందరి కంటే మీరు ప్రత్యేకం అంటూ కితాబిచ్చాడు. మీరు ప్రత్యేకంగా అందరికి సేవ చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్బంగా అమితాబ్ అన్నారు.
10664 589567You ought to join in a contest first of the greatest blogs on the web. I will recommend this web site! 439884