తెలుగుదేశం పార్టీ నేత నందం సుబ్బయ్య హత్యతో తనకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం చౌడేశ్వరీ ఆలయంలో ప్రమాణం చేశారు.
ఇటీవల టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ ప్రోద్బలంతోనే సుబ్బయ్య హత్య జరిగిందని ఆయన భార్య ఆరోపించారు. వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఎమ్మెల్యే రాచమల్లు.. దేవుడి ఎదుట ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ విమర్శలకు భయపడి తాను ప్రమాణం చేయడంలేదని.. ప్రొద్దుటూరు ప్రజల కోసమే ప్రమాణం చేస్తున్నాని స్పష్టంచేశారు. సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆయన్ను హత్య చేయమని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఒకవేళ ఆయన హత్య గురించి తెలిసి ఉంటే కచ్చితంగా ఆపి ఉండేవాడినన్నారు. హత్య జరిగిన విజయం ప్రజలకు ఎలా తెలిసిందో.. తనకూ అలాగే తెలిసిందని వివరించారు. ఒకవేళ తాను ఈ విషయంలో తప్పు చెబితే అమ్మవారి శిక్షకు గురవుతానని పేర్కొన్నారు.
863252 32937Extremely usefull blog. i will follow this blog. maintain up the good function. 468603
744782 748896My spouse and I stumbled more than here from a different website and thought I may as nicely check items out. I like what I see so now im following you. Appear forward to going more than your internet page repeatedly. 515900
879394 87638I always was concerned in this topic and stock nonetheless am, regards for posting . 232147