తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ మరియు జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ మరో సారి నిర్థారించారు ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రస్తుతం పార్టీలు రెండు కూడా ఆ విషయమై స్పష్టమైన అవగాహణతో ఉన్నాయని త్వరలోనే రెండు పార్టీలకు ఆమోద యోగ్యమైన అభ్యర్థిని ఖరారు చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలకు ఆమోదకరమైన అభ్యర్థి ఎన్నిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.
ఇక ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్ల విషయమై సోము వీర్రాజు మాట్లాడుతూ నామినేషన్ ల సందర్బంగా విద్వంసాలు జరుగకుండా ఆన్ లైన్ ద్వారా నామినేషన్ లను స్వీకరించాలంటూ సోము వీర్రాజు డిమాండ్ చేశాడు. ఈ విషయమై 29వ తారీకు వరకు నిర్ణయం తీసుకోవాలని అన్నాడు. ఇక చాలా కోట్ల బలవంతంగా ఏకగ్రీవాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక ఆ విషయమై కూడా ఎన్నికల కమీషన్ దృష్టి పెట్టాలన్నారు. వైకాపా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సహకరించాల్సిందిగా సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
985177 586380I see something genuinely unique in this internet site . 196821