జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఎసి) ఈనెల 21న తిరుపతి లో భేటీ అవ్వబోతుంది. ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన కీలక విషయాలను చర్చించబోతున్నట్లుగా పార్టీ నాయకత్వం ద్వారా సమాచారం అందుతోంది.
తిరుపతి ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా సీటు వారికి వదిలి పెట్టాలా లేదంటే జనసేన అభ్యర్థిని పోటీకి దించాలా అనే విషయాన్ని ఈ సమావేశంలో చర్చిస్తారని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ మీటింగ్ లో పార్టీ భవిష్యత్తు ప్రణాళికను సిద్దం చేయబోతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కింది స్తాయి కార్యకర్తలను ఎలా సిద్దం చేయాలనే విషయాన్ని కూడా చర్చించబోతున్నారు.
ఈ నెల 21వ తేదీన తిరుపతికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/ZRQjsZBz2g
— JanaSena Party (@JanaSenaParty) January 15, 2021
15945 307041I surely didnt understand that. Learnt a thing new today! Thanks for that. 245793
262655 41108The when I just read a weblog, Im hoping that this doesnt disappoint me approximately this one. Get real, Yes, it was my method to read, but When i thought youd have something fascinating to state. All I hear can be a number of whining about something that you could fix ought to you werent too busy trying to find attention. 249267