Switch to English

ఢిల్లీ బీజేపీ ఇచ్చిన గౌరవం, ఏపీ బీజేపీ ఇవ్వట్లేదన్న జనసేనాని!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ఢిల్లీ బీజేపీ నేతల నుంచి మనకు మంచి గౌరవం దక్కుతోంది. రాష్ట్రంలో బీజేపీ విషయానికొస్తే, కొన్ని సమస్యలున్నాయి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటగా ఆ వ్యాఖ్యలు చేయలేదు పవన్ కళ్యాణ్.

‘పిఎసి సమావేశంలో పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఈ విషయాల్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళతాం. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధంగా వున్నాం. అయితే, బీజేపీతో కలిసి చర్చించాకే స్పష్టత వస్తుంది. జనసేన గనుక పోటీ చేస్తే, మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ నేనే పర్యటించి, అభ్యర్థి గెలిచేందుకు కృషి చేస్తాను. బీజేపీ గనుక పోటీ చేయాల్సి వస్తే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరహాలో ఆ పార్టీ పూర్తి శ్రద్ధ పెట్టాలి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించినట్లే, బీజేపీకి తిరుపతిలో సహకరిస్తాం. ఏ అంశం అయినా, ఓ వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మిత్రపక్షం జనసేనతో చర్చించకుండా, ‘జనసేన బలపరిచిన, బీజేపీ అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తారు..’ అని బీజేపీ పలుమార్లు ప్రకటించేయడం పట్ల జనసేన నేతల్లో కొంత ఆవేదన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని పిఎసిలో చర్చించడం ద్వారా బీజేపీకి గట్టి మెసేజ్ పంపించాలనుకున్న జనసేన అధినేత, ఇందుకు తిరుపతిని వేదికగా చేసుకోవడం గమనార్హం.

మరోపక్క, రాష్ట్రంలో మత రాజకీయాలపై స్పందించిన జనసేన, మత రాజకీయాలు చేయడం ఇష్టం లేకనే రామతీర్థం వెళ్ళలేదని చెప్పారు. ఇది కూడా బీజేపీకి కొంత ఇబ్బంది కలిగించే ప్రకటనే. రాష్ట్రంలో మతం పేరుతో రాజకీయాలు నడుస్తున్న మాట వాస్తవం. వైసీపీ, బీజేపీ, టీడీపీ.. పోటీ పడి మరీ మత రాజకీయాలు చేస్తున్నాయి.

చంద్రబాబు,జగన్ లాంటి వాళ్ళు ఆలయాల పై జరుగుతున్న దాడుల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని తమది కానీ హిందుత్వ అజెండాని భుజాల మీద వెస్కోని అవకాశవాద రాజకీయాలు చేస్తున్న సంధర్భంలో,బీజేపీ లాంటి మతతత్వ పార్టీతో పొత్తులో ఉండి కూడా అన్ని మతాల పై సమ భావనతో ఉంటానని మానవత్వం కంటే మించిన మతం లేదని పునరుధ్ఘాటించడం,రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ఆలోచన లేకుండా ఉద్రిక్తతలు పెంచి సమస్యను జటిలం చేయాలని భావించకుండా భాద్యతాయుతంగా వ్యవహరించడం అభినందనీయం.

జనసేన పార్టీ, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూనే.. మత రాజకీయాలకు కాస్త దూరంగా వ్యవహరిస్తోంది. ఇది బీజేపీ అగ్ర నాయకత్వానికి మింగుడుపడ్డంలేదు.

బీజేపీ ప్రాపకం కొరకు,బీజేపీ మెప్పు కొరకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ,బీజేపీతో పొత్తులో ఉండి కూడా తన భావజాలాన్ని,సిద్దాంతాన్ని విడువకుండా విలువలతో రాజకీయం చేయడం పవన్ కళ్యాణ్ ని నాయకుడిగా మరో మెట్టు ఎక్కించింది

బీజేపీది సింగిల్ పాయింట్ ఎజెండా.. అదే హిందుత్వం. ఆ దిశగా జనసేన కూడా అడుగులేస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా ఇబ్బందులు పడేలా.. రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరిత రాజకీయాల్ని తెరపైకి తెచ్చే అవకాశముంది. ఏదిఏమైనా, తిరుపతి ఉప ఎన్నిక జనసేనకు కత్తిమీద సాము లాంటిదే. గెలుపోటముల సంగతి పక్కన పెడితే, జనసేన.. తిరుపతిలో పోటీ చేయకపోవడమే ఆ పార్టీకి మంచిదేమో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...