‘ఢిల్లీ బీజేపీ నేతల నుంచి మనకు మంచి గౌరవం దక్కుతోంది. రాష్ట్రంలో బీజేపీ విషయానికొస్తే, కొన్ని సమస్యలున్నాయి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటగా ఆ వ్యాఖ్యలు చేయలేదు పవన్ కళ్యాణ్.
‘పిఎసి సమావేశంలో పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఈ విషయాల్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళతాం. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధంగా వున్నాం. అయితే, బీజేపీతో కలిసి చర్చించాకే స్పష్టత వస్తుంది. జనసేన గనుక పోటీ చేస్తే, మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ నేనే పర్యటించి, అభ్యర్థి గెలిచేందుకు కృషి చేస్తాను. బీజేపీ గనుక పోటీ చేయాల్సి వస్తే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరహాలో ఆ పార్టీ పూర్తి శ్రద్ధ పెట్టాలి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించినట్లే, బీజేపీకి తిరుపతిలో సహకరిస్తాం. ఏ అంశం అయినా, ఓ వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
మిత్రపక్షం జనసేనతో చర్చించకుండా, ‘జనసేన బలపరిచిన, బీజేపీ అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తారు..’ అని బీజేపీ పలుమార్లు ప్రకటించేయడం పట్ల జనసేన నేతల్లో కొంత ఆవేదన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని పిఎసిలో చర్చించడం ద్వారా బీజేపీకి గట్టి మెసేజ్ పంపించాలనుకున్న జనసేన అధినేత, ఇందుకు తిరుపతిని వేదికగా చేసుకోవడం గమనార్హం.
మరోపక్క, రాష్ట్రంలో మత రాజకీయాలపై స్పందించిన జనసేన, మత రాజకీయాలు చేయడం ఇష్టం లేకనే రామతీర్థం వెళ్ళలేదని చెప్పారు. ఇది కూడా బీజేపీకి కొంత ఇబ్బంది కలిగించే ప్రకటనే. రాష్ట్రంలో మతం పేరుతో రాజకీయాలు నడుస్తున్న మాట వాస్తవం. వైసీపీ, బీజేపీ, టీడీపీ.. పోటీ పడి మరీ మత రాజకీయాలు చేస్తున్నాయి.
చంద్రబాబు,జగన్ లాంటి వాళ్ళు ఆలయాల పై జరుగుతున్న దాడుల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని తమది కానీ హిందుత్వ అజెండాని భుజాల మీద వెస్కోని అవకాశవాద రాజకీయాలు చేస్తున్న సంధర్భంలో,బీజేపీ లాంటి మతతత్వ పార్టీతో పొత్తులో ఉండి కూడా అన్ని మతాల పై సమ భావనతో ఉంటానని మానవత్వం కంటే మించిన మతం లేదని పునరుధ్ఘాటించడం,రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ఆలోచన లేకుండా ఉద్రిక్తతలు పెంచి సమస్యను జటిలం చేయాలని భావించకుండా భాద్యతాయుతంగా వ్యవహరించడం అభినందనీయం.
జనసేన పార్టీ, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూనే.. మత రాజకీయాలకు కాస్త దూరంగా వ్యవహరిస్తోంది. ఇది బీజేపీ అగ్ర నాయకత్వానికి మింగుడుపడ్డంలేదు.
బీజేపీ ప్రాపకం కొరకు,బీజేపీ మెప్పు కొరకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ,బీజేపీతో పొత్తులో ఉండి కూడా తన భావజాలాన్ని,సిద్దాంతాన్ని విడువకుండా విలువలతో రాజకీయం చేయడం పవన్ కళ్యాణ్ ని నాయకుడిగా మరో మెట్టు ఎక్కించింది
బీజేపీది సింగిల్ పాయింట్ ఎజెండా.. అదే హిందుత్వం. ఆ దిశగా జనసేన కూడా అడుగులేస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా ఇబ్బందులు పడేలా.. రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరిత రాజకీయాల్ని తెరపైకి తెచ్చే అవకాశముంది. ఏదిఏమైనా, తిరుపతి ఉప ఎన్నిక జనసేనకు కత్తిమీద సాము లాంటిదే. గెలుపోటముల సంగతి పక్కన పెడితే, జనసేన.. తిరుపతిలో పోటీ చేయకపోవడమే ఆ పార్టీకి మంచిదేమో.!
798161 522719I discovered your blog website on google and check just several of your early posts. Proceed to preserve up the superb operate. I just extra up your RSS feed to my MSN Details Reader. Seeking forward to reading much more from you in a whilst! 53231