శంకర్ .. ఈ పేరు చెబితే చాలు .. ఇండియన్ స్క్రీన్ పై వండర్స్ కనిపిస్తాయి. భారీ చిత్రాల దర్శకుడిగా, తన సినిమాలతో సమాజానికి సందేశం ఇస్తూ గొప్ప సినిమాలు తెరకెక్కించే శంకర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి నిన్నటితో పాతికేళ్ళు. జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శంకర్ ఆ తరువాత తీసిన ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, జీన్స్, రోబో, ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన సినిమాలు అబ్బురపరుస్తాయి. సామజిక సందేశంతో పాటు సాంకేతికతను ఉపయోగించడంలో అయన స్టైలే వేరు. దర్శకుడిగా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న శంకర్ ఇప్పుడు భారతీయ ప్రముఖ దర్శకులలో ముందు వరసలో ఉంటాడు.
శంకర్ పాతికేళ్ల ప్రస్థానం సందర్బంగా తమిళ దర్శకులంతా కలిసి ఆయనను అభినందనలతో ముంచెత్తారు. తమిళ దర్శకులంతా రీ యూనియన్ మీట్ పేరుతొ శంకర్ ని కలిశారు. బ్లూ అండ్ బ్లూ యూనిఫామ్ ధరించి ఆయనకు గొప్పగా శుభాకాంక్షలు అందించారు. ఈ దర్శకుల లిస్టు లో సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంతో పాటు గౌతమ్ మీనన్ లాంటి వారితో కలిసి అట్లీ కుమార్, పా రంజిత్ లాంటి వర్ధమాన దర్శకులు ఉన్నారు.
ఈ దర్శకులంతా తనకు ఇలా సపోర్ట్ అందిస్తూ .. అభినందించడం చాలా ఆనందంగా ఉందని, నిజంగా ఈ విషయంలో ఓ దర్శకుడిగా ఎంతో సంతోషిస్తున్నానని తెలిపాడు శంకర్. శంకర్ తెరకెక్కించిన రోబో 2. 0 సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అయన కమల్ తో భారతీయుడు 2 తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమా తరువాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
