మే ఆఖరి వారంలో సినీ పెద్దలు అందరూ కలిసి షూటింగ్ లు ఎలాగైనా వీలైనంత త్వరలో మొదలుపెట్టేద్దామని ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అవసరమైన పెర్మిషన్స్ తెచ్చేసుకున్నారు. అయితే అదే ఆనందంలో ఇక షూటింగ్స్ మొదలుపెట్టేద్దామనుకున్నారు కానీ ఈలోగానే కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతుండడంతో సినిమా వాళ్ళు వెనక్కి తగ్గారు. అయితే సీరియల్స్ యధావిధిగా షూటింగ్స్ ను మొదలుపెట్టినా ఆ యూనిట్ సభ్యులకే కరోనా పాజిటివ్ రావడంతో వాళ్ళు కూడా షూటింగ్స్ ఆపకతప్పలేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెప్టెంబర్ దాకా ఎవరూ షూటింగ్స్ అన్న మాట ఎత్తే పరిస్థితి లేదు. అయితే శేఖర్ కమ్ముల మాత్రం తన సినిమా షూటింగ్ ను మొదలుపెట్టేస్తాను అంటున్నాడట. శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత భారీ గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవిలు జంటగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫిదా తరహాలోనే లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ప్రధాన పాయింట్ గా ఈ చిత్రం ఉండనుంది.
నిజానికి ఏప్రిల్ లోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ లు వాయిదా పడడంతో రిలీజ్ ఆగిపోయింది. ఇంకా 15 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల ఆగస్ట్ నుండి షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టాలని పట్టుదలగా ఉన్నాడట. మరి అనుకున్న ప్రకారంగా షూటింగ్ ను మొదలుపెట్టగలడేమో చూడాలి.
618127 912496Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you might be interested in hearing. Either way, great internet site and I look forward to seeing it expand more than time. 25910
878136 599105Thank you a good deal for sharing this with all individuals you in fact recognize what you are speaking about! Bookmarked. Please in addition talk over with my internet internet site =). We could have a hyperlink alternate arrangement among us! 764197
670897 625926so a lot fantastic information on here, : D. 350997