ఏపీ ప్రజల వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. గడువులోగా పనులన్నీ పూర్తిచేసి సాగునీరందించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం స్పిల్ వేపై గడ్డర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 1.054 కిలోమీటర్ల పొడవున్న స్పిల్ వే పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వీటికి సంబంధించిన పిల్లర్లన్నీ 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. దీంతో గడ్డర్లను అమర్చే ప్రక్రియ ప్రారంభించారు.
మొత్తం 52 బ్లాకులున్న స్పిల్ వేపై 196 గడ్డర్లు అమర్చనున్నారు. వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా సాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలు వచ్చే ఆగస్టులో మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ పనులు జరిగే విధంగా ప్రణాళిక రూపొందించారు. దీంతో గడ్డర్ల ఏర్పాటు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోపే పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం మిగిలిన పనులను వేగంగా చేయడం ద్వారా 2021 డిసెంబర్ లోగా ప్రాజెక్టును పూర్తి చేసి, 2022 జూన్ నాటికి నీరందించాలని ఏపీ సర్కారు కృత నిశ్చయంతో ఉంది.
పది రోజుల క్రితం పోలవరం పనుల పురోగతిపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి నాళ్లలో పనుల్లో కాస్త జాప్యం జరిగినా అనంతరం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పనులను బాబు వేగవంతం చేయించారు.
అయితే, ఎన్నికల్లో బాబు ఓటమి పాలవడం.. పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపణలు చేయడం.. రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్ ను మార్చడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో తొలుత పనుల్లో కాస్త జాప్యం చేసుకున్నా.. అనంతరం సీఎం జగన్ దీనిపై దృష్టి పెట్టడంతో పనుల్లో వేగం పెరిగింది. మొత్తానికి ఏపీ ప్రజల వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టు గడువులోగా పూర్తి కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్నో ఏళ్ల నాటి ఏపీ ప్రజల కల సాకారమైనట్టే.
184829 827917Thanks for sharing excellent informations. Your website is very cool. 679430
580977 990062Hi there. Very cool site!! Guy .. Beautiful .. Amazing .. I will bookmark your web site and take the feeds additionallyI am glad to locate so considerably beneficial info correct here in the article. Thanks for sharing 250936
480419 774132I see something genuinely unique in this web site . 363851