Switch to English

వేగంగా పోలవరం.. గడ్డర్ల ఏర్పాటు షురూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

ఏపీ ప్రజల వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. గడువులోగా పనులన్నీ పూర్తిచేసి సాగునీరందించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం స్పిల్ వేపై గడ్డర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 1.054 కిలోమీటర్ల పొడవున్న స్పిల్ వే పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వీటికి సంబంధించిన పిల్లర్లన్నీ 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. దీంతో గడ్డర్లను అమర్చే ప్రక్రియ ప్రారంభించారు.

మొత్తం 52 బ్లాకులున్న స్పిల్ వేపై 196 గడ్డర్లు అమర్చనున్నారు. వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా సాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలు వచ్చే ఆగస్టులో మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ పనులు జరిగే విధంగా ప్రణాళిక రూపొందించారు. దీంతో గడ్డర్ల ఏర్పాటు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోపే పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం మిగిలిన పనులను వేగంగా చేయడం ద్వారా 2021 డిసెంబర్ లోగా ప్రాజెక్టును పూర్తి చేసి, 2022 జూన్ నాటికి నీరందించాలని ఏపీ సర్కారు కృత నిశ్చయంతో ఉంది.

పది రోజుల క్రితం పోలవరం పనుల పురోగతిపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి నాళ్లలో పనుల్లో కాస్త జాప్యం జరిగినా అనంతరం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పనులను బాబు వేగవంతం చేయించారు.

అయితే, ఎన్నికల్లో బాబు ఓటమి పాలవడం.. పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపణలు చేయడం.. రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్ ను మార్చడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో తొలుత పనుల్లో కాస్త జాప్యం చేసుకున్నా.. అనంతరం సీఎం జగన్ దీనిపై దృష్టి పెట్టడంతో పనుల్లో వేగం పెరిగింది. మొత్తానికి ఏపీ ప్రజల వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టు గడువులోగా పూర్తి కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్నో ఏళ్ల నాటి ఏపీ ప్రజల కల సాకారమైనట్టే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...