నాని విడుదల చేసిన ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,454FansLike
57,764FollowersFollow

కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు మేకర్స్.

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఈరోజు(సెప్టెంబర్ 19) ఉదయం జరిగిన రిలీజ్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రచయిత బి.వి.ఎస్.రవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “చార్లీ సినిమా సమయంలో రక్షిత్ గారిని కలిశాను. వారికి సినిమానే జీవితం. అందుకే వారు ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నారు. టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడూ మంచి సినిమాలు తీయాలనే వీరి తపన అభినందించదగ్గది. ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం సంతోషంగా కలిగిస్తోంది” అన్నారు.

రచయిత బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ.. ” డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఫోన్ చేసి ఇది అద్భుతమైన సినిమా, అర్జెంట్ గా చూడమన్నారు. నేను సినిమాకి సంబంధించిన వివరాలు అడుగుతుంటే కనీసం ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళమని చెప్పారు. దాంతో ఈ సినిమాని నేను కన్నడ వెర్షన్ లో చూశాను. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. అసలు ఇది ప్రేమ కథ అనాలా, జీవిత కథ అనాలా.. చెప్పడానికి మాటలు వెతుక్కోవాలి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా గురించే ఆలోచించేలా చేస్తూ ఇంటికి తీసుకెళ్ళిపోయే గొప్ప సినిమా ఇది. కన్నీళ్లు మానవత్వానికి సాక్ష్యమైతే.. కన్నీటి సంద్రం ఈ సినిమా. ఇది అంత లోతైన సినిమా. ప్రేమ మనిషి చేత ఎంత తప్పయినా చేయిస్తుంది, ఎంత సాహసమైనా చేయనిస్తుంది. ఆ ప్రేమ ఎంత గొప్ప గొప్పదంటే.. సప్త సముద్రాలు అంత ఉండటమే కాదు, దాని ఆవల కూడా ఉందని చెప్పిన సినిమా ఇది. ఒక్క రిస్క్ వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అయ్యయో ఎంతో వివరంగా చూపించారు. ప్రతి షాట్ లోనూ కథ చెప్పారు. ఒక్క షాట్ మిస్ అయితే కథ ఏమైనా మిస్ అవుతాం అనిపించేలా ఉంది. సినిమా చివరిలో రెండో భాగం ఉందని గ్లింప్స్ చూపించారు. ఆ గ్లింప్స్ లో ఇంకా పెద్ద జీవితం ఉంది. 22 ఏళ్ల కుర్రాడికి 33 ఏళ్ల దాకా జీవితం చెప్పి.. 33 ఏళ్ల నుంచి మళ్ళీ ఎంత దాకా జీవితం అనుభవించాడు. జీవితంలో ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగిందని చెప్పడం మామూలు విషయం కాదు. రక్షిత్ శెట్టి ఇంత గొప్ప రచయిత కాకపోతే, ఈ కథని ఇంత గొప్పగా అర్థం చేసుకునేవారు కాదు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ గారు మనకి జీవితాంతం గుర్తుండే పాత్ర పోషించారు. దర్శకుడు హేమంత్ గారు సినిమాని ఎంతో పొయెటిక్ గా తీశారు. ప్రతి ఫ్రేమ్ లో దర్శకత్వ ప్రతిభ కనిపించింది. ఈ సినిమా చూడటం అనేది మనకో మధురానుభూతి” అన్నారు.

కథానాయకుడు రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. “సప్త సాగర దాచే ఎల్లో మొదట కన్నడలో విడుదల చేశాం. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా విడుదల ఎందుకు చేయలేదని చాలామంది అడుగుతున్నారు. కొన్ని సినిమాలను మనం తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాటంతట అవే పయనిస్తాయి. ఈ సినిమాని మేం ఎంతగానో నమ్మాం. చార్లీ సినిమా కర్ణాటక తర్వాత తెలుగులోనే బాగా ఆడింది. అందుకే నేను ఈ ప్రాంతాన్ని సినిమా భూమిగా భావిస్తాను. ఇక్కడ సినిమాని ఒక సంస్కృతిగా చూస్తారు. నాక్కూడా సినిమానే జీవితం, సినిమానే దేవుడు. చార్లీ సినిమాని ఆదరించి, ఇక్కడ సప్త సాగర దాచే ఎల్లో విడుదలకు బాటలు వేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దర్శకుడు హేమంత్ కి ఇది మూడో సినిమా. మూడు సినిమాలు కూడా కన్నడలో మంచి విజయం సాధించాయి. ఇది అతని పూర్తి స్థాయి దర్శకత్వ ప్రతిభను తెలిపే చిత్రం. హీరోయిన్ రుక్మిణీ వసంత్ సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

కథానాయిక రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 1న కన్నడ వెర్షన్ హైదరాబాద్ లో కూడా విడుదల కాగా ఊహించని స్పందన లభించింది. ఇప్పుడు తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తుండటం సంతోషం కలిగిస్తోంది. మా మను-ప్రియ ల కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు హేమంత్ ఎం రావు మాట్లాడుతూ.. “ఈ సినిమా సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో మా సినిమా విడుదలవుతుండటం గర్వంగా ఉంది. ఈ ప్రాంతాన్ని సినిమా భుమిగా అభివర్ణిస్తారు. హైదరాబాద్ లో కన్నడ వెర్షన్ కొన్ని షోలు ప్రదర్శించగా ఊహించని స్పందన లభించింది. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా తెలుగులో విడుదల అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “ఈ సినిమా కన్నడలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించడుతోంది. చార్లీ సినిమాని తెలుగులో రానా గారు విడుదల చేయగా మంచి విజయం సాధించింది. రక్షిత్ గారికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని, ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాని ఇక్కడ విడుదల చేయాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే టీజర్ ను విడుదల చేశామో, సోషల్ మీడియాలో వచ్చిన అనూహ్య స్పందన చూసి, ఇక్కడ కూడా ఈ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారని అర్థమైంది. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

‘సప్త సాగరాలు దాటి’ చిత్ర ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.

3 COMMENTS

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

Mouni Roy: భర్తతో విబేధాలా..? ఇన్ స్టాలో అన్ ఫాలో.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నటి..!

Mouni Roy: మరో సినీ నటి భర్త నుంచి విడిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సీనీ వర్గాలు. బాలావుడ్ నటి మౌనీ రాయ్ భర్త సూరజ్ నంబియార్ తో విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి....

Chiranjeevi: ‘చిరంజీవిగారిని కలిసింది అందుకే..’ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

Chiranjeevi: సినిమాల్లో కొత్తవారిని ప్రోత్సహించడం, నటీనటుల నటనను మెచ్చుకోవడం, టెక్నీషియన్ల ప్రతిభను కొనియాడటం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఎందరో నటీనటులు, దర్శకులు తమ సినిమా మెగాస్టార్ చూడాలని ఆయన...

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

Peddi: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..! గ్రాండ్ ఈవెంట్ కు ప్లానింగ్

Peddi: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,...