Samantha- Anushka: సినీ పరిశ్రమలో ప్రస్తుతం మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఇప్పటివరకు స్టార్ హీరోల మల్టీస్టారర్లే ఎక్కువగా తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ల మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha), బాలీవుడ్ స్టార్ హీరో అనుష్క శర్మ( Anushka Sharma) కలయికలో మల్టీస్టారర్ ఒకటి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నిజజీవితంలో మంచి ఫ్రెండ్స్.
సోషల్ మీడియాలో ఒకరి పోస్టుల పై మరొకరు స్పందిస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ లేదా సినిమానా అనేది ఇంకా తేలలేదు. ఈ ప్రాజెక్ట్ కి అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మ నిర్మాత గా వ్యవహరిస్తారు. దీనిని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నన్నారు.
ఇటీవలే ‘శాకుంతలం( Shakuntalam)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. దీనితో పాటు ఆమె ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్, విజయ్ దేవరకొండ( Vijay Devarakonda)తో ‘ఖుషి( Khushi)’ సినిమాలు చేస్తోంది. ఇక అనుష్క శర్మ విషయానికొస్తే ఆమె ప్రధాన పాత్రలో.. ప్రముఖ క్రికెటర్ జులన్ గోస్వామి జీవిత ఆధారంగా వస్తున్న ‘చెక్ దా ఎక్స్ప్రెస్’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.