ఓ వైపు ఎన్నికల వేడి.. మరోవైపు భానుడి దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల్లో తాజాగా టీవీ9 వ్యవహారం మరిన్ని సెగలు రేపుతున్నాయి. మెరుగైన సమాజం కోసం అంటూ నీతులు వల్లెవేసిన ఆ ఛానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఫోర్జరీ కేసులో చిక్కుకోవడం దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. సంస్థ నిధులను దుర్విగినియోగం చేయడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం కలకలం రేపింది.
దీంతో గురువారం పోలీసులు టీవీ9 కార్యాలయంతోపాటు టీవీ9 డైరెక్టర్ మూర్తి, మాజీ సీఈఓ రవిప్రకాశ్, నటుడు శివాజీ నివాసాల్లో సోదాలు జరిపారు. ఈ వ్యవహారంపై దాదాపు అన్ని ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే, శుక్రవారం ఉదయం టీవీ9 కార్యాలయం వద్ద కవరేజ్ చేస్తున్న సాక్షి మీడియా ప్రతినిధులపై ఆయన అనుచరులు దాడికి యత్నించారు. వాస్తవానికి అక్కడ ఇతర ఛానళ్ల ప్రతినిధులు కూడా కవరేజ్ చేస్తున్నప్పటికీ కేవలం సాక్షి మీడియానే రవిప్రకాశ్ అనుచరులు అడ్డుకున్నారు. సాక్షి రిపోర్టర్ ను నెట్టివేస్తూ, కెమెరాను లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర ఛానళ్ల ప్రతినిధులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం సాక్షిని మాత్రమే అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే వారు ఇలా చేశారా? సాక్షిని అడ్డుకోవాలన్న తమ బాస్ ఆదేశాల మేరకే వారు ప్రవర్తించారా? అంటే.. ఔననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సాక్షిని మాత్రమే రవిప్రకాశ్ లక్ష్యం చేసుకోవడానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే.. కొంత వెనక్కి వెళ్లాలి. మెరుగైన సమాజం కోసం అంటూ టీవీ జర్నలిజంలో కొత్త ఒరవడి సృష్టించిన టీవీ9.. జనాల ఆదరణతోపాటు చాలా అంశాల్లో విమర్శలు కూడా మూటగట్టుకుంది. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా బాకా కొట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కు వ్యతిరేకిగా మారింది. ఓ దశలో రవిప్రకాశ్ కు జగన్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారని సమాచారం. దీంతో ఇరువురి మధ్య వైరం మరింత ముదిరింది. ఇది అలా కొనసాగుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో నటుడు శివాజీ ద్వారా ఆపరేషన్ గరుడ పేరుతో టీవీ9 ప్రసారం చేసిన ఎపిసోడ్.. తెలుగు రాజకీయాల్లో కలకలం రేపింది. ఇదంతా టీడీపీ ఆడిస్తున్న నాటకం అని వైఎస్సార్ సీపీ ఖండించినప్పటికీ, ఎప్పటికప్పుడు ఆపరేషన్ గరుడ వివరాలంటూ నటుడు శివాజీకి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేయడంలో టీవీ9 బాగా సక్సెస్ అయింది.
అయితే, ఈ క్రమంలో టీవీ9 యాజమాన్యం మారింది. సంస్థ చైర్మన్ శ్రీనిరాజు తన 90 శాతం వాటాలను అలంద మీడియాకు విక్రయించడంతో అధికారికంగా యాజమాన్య మార్పిడి కూడా పూర్తయింది. అయితే, కొత్త యాజమాన్యానికి రవిప్రకాశ్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. డైరెక్టర్ల నియామకానికి సైతం అడ్డు తగలడం.. కొత్త యాజమాన్యాన్ని ఇరుకున పెట్టే ఉద్దేశంతో తెరవెనుక పావులు కదుపుతున్నారనే విషయం తెలియడంతో అలంద మీడియా పోలీసులను ఆశ్రయించింది. సంస్థ నిధులను అక్రమంగా తన ఖాతాలకు మళ్లించుకోవడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇలాంటి అవకాశం కోసమే వేచి చూస్తున్న సాక్షి మీడియా.. ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేసింది. తన ఛానల్ తోపాటు పత్రికలోనూ కథనాలు ప్రచురించింది. వీటికి తోడు వైఎస్సార్ సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రవిప్రకాశ్ పై విరుచుకుపడ్డారు. అనంతరం సాక్షి పత్రికలో ఆయన పేరుతో పెద్ద కథనం కూడా ప్రచురితమైంది. సహజంగానే ఇది రవిప్రకాశ్ కు ఆగ్రహం కలిగించింది. దీంతో టీవీ9 కార్యాలయం వద్ద రిపోర్టింగ్ చేస్తున్న సాక్షి మీడియా ప్రతినిధులను ఆయన అనుచరులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది.
57218 542147I admire the helpful facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im extremely sure theyll learn plenty of new items appropriate here than anybody else! 722778
689199 148608Great post man, keep the nice work, just shared this with my friendz 786584