మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉంటున్నాడు. రాజకీయాలకు పూర్తిగా దూరం అయిన తర్వాత ఒక వైపు తెలంగాణ సీఎం కేసీఆర్తో మరియు ఏపీ సీఎం జగన్తో కూడా చిరంజీవి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు.
ఇదే సమయంలో ఏపీ మరియు తెలంగాణ సీఎంలు పలు విషయాల్లో కలిసి ముందుకు నడిచే ఉద్దేశ్యంతో స్నేహపూర్వంగా మెలుగుతున్నారు. ఈనేపథ్యంలోనే తెలుగు సినిమా ప్రముఖులు ఎంతగానో ఎదురు చూస్తున్న నంది అవార్డులను కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అందించాలని ఇండస్ట్రీ వారు కోరుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఇండస్ట్రీ నుండి నంది అవార్డు కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయని.. అందుకు చిరంజీవిని చైర్మన్గా నియమించాలని కూడా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట.
నంది అవార్డుల సెలక్షన్ కమిటీ చైర్మన్గా చిరంజీవి ఎంపిక అయినట్లే అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ విషయమై విభిన్నంగా స్పందిస్తున్నారు. నంది అవార్డుల ఎంపిక పక్రియ అనేది ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటుంది.
ఖచ్చితంగా చిరంజీవి ఎంత జెన్యూన్గా అవార్డులకు నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసినా కూడా చిరంజీవిపై ఎవరో ఒకరు బురద జల్లడం ఖాయం. అందుకే చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవి తీసుకోవదంటూ మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.
చిరంజీవి వరుసగా సినిమాలు చేయడంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న చిన్న చితక సమస్యలపై దృష్టి పెడితే చాలంటూ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలా మంది అంటున్నారు.
నంది అవార్డు బాధ్యతను నెత్తిన పెట్టుకోవడం వల్ల ఆయన అప్రదిష్టపాలవ్వడం తప్ప మరేమి లేదంటూ ఆయన అభిమానులు అంటున్నారు. మరి చిరంజీవి నిర్ణయం ఏంటి అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.