తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. అక్కడ ఉత్సాహంగా సంబరాల్లో ఎంజాయ్ చేశారు. ‘రాష్ట్రంలో అధికారం మారబోతోంది..’ అంటూ గతంలోనే తాను చెప్పాననీ, అదే నిజమయ్యిందనీ తలసాని సెలవిచ్చారు. ‘మేం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం.. ఇచ్చాం..’ అని తలసాని చెప్పుకొచ్చారు. ఇంతకీ, తలసాని శ్రీనివాస్యాదవ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరికి.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికా.? ఆంధ్రప్రదేశ్ ప్రజలకా.? ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంలో జరుగుతున్న చర్చ.
టీఆర్ఎస్ – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య అవగాహన కారణంగా, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం కోల్పోయిన మాట వాస్తవం. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక ‘సహకారం’ గట్టిగానే అందించింది. దాదాపు వెయ్యి కోట్లు, వైసీపీ తరఫున టీఆర్ఎస్ ఖర్చుపెట్టిందంటూ టీడీపీ ముఖ్య నేత ఒకరు ఈ మధ్యనే సంచలన ఆరోపణలు చేశారు.
అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర అభివృద్ధిని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో అడ్డుకుంటున్నారనీ, తద్వారా తెలంగాణకు అంతకు మించి మేలు కలిగిందనీ సదరు టీడీపీ నేత ఆరోపించిన విషయం విదితమే. తలసాని చెప్పిన రిటర్న్ గిఫ్ట్ వ్యవహారం ఇదేనంటూ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి మూడు రాజధానుల గురించి మంచి దృక్పథంతోనే ఆలోచన చేస్తే, అమరావతిలో నిర్మాణాల్ని గత ఏడు నెలలుగా ఆపేయాల్సిన అవసరం లేదు వైఎస్ జగన్ ప్రభుత్వానికి.
కానీ, అక్కడ ఏడు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అంటే, పూర్తిగా అమరావతిని కాలగర్భంలో కలిపేయడమన్న ఎజెండాతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుందన్న విషయం సుస్పష్టమవుతోంది. దానికి ‘మూడు రాజధానుల ముసుగు’ వేశారు.. దాన్ని అమలు పరిచేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు కూడా. ఒక్క రాజధానిని నిర్మించుకోలేకపోయిన ఆంధ్రప్రదేశ్లో, మూడు రాజధానులు సాధ్యమేనా.?
565625 45482This is the sort of details Ive long been in search of. Thanks for posting this details. 339995