తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెడ్ జోన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు జిల్లాలు, తెలంగాణ నుంచి ఆరు జిల్లాలు రెడ్ జోన్లో వున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ జిల్లాల లెక్క విషయంలోనే కొంత గందరగోళం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23 జిల్లాలు అయితే, అందులో తెలంగాణ ప్రాంతానికి 10 జిల్లాలు, ఆంధ్ర ప్రాంతానికి 13 జిల్లాలుండేవి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 33కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పాత 13 జిల్లాలే వున్నాయి. ఆ జిల్లాల సంఖ్య పెరగలేదు. దాంతో, జిల్లాల ప్రాతిపదికన కాకుండా మండలాల ప్రాతిపదికన రెడ్ జోన్ల ఎంపిక వుండాలన్నది ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదన.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది కూడా. ఏ జిల్లాలో ఏయే మండలాలు రెడ్ జోన్లో వున్నాయో పేర్కొంటూ వస్తోంది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని మినహాయింపుల్ని కేంద్రం ఇస్తూ వస్తోంది ‘లాక్డౌన్’ నిబంధనల్లో. మే 3 తర్వాత గ్రీన్ జోన్లలో కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ఆరెంజ్ జోన్లలోనూ కొన్ని వెసులుబాట్లు వస్తాయి. రెడ్ జోన్లలో మాత్రం నిబంధనలు కొనసాగుతాయి. ఇదే అసలు సమస్య.
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెడ్ జోన్లో వున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్నే తీసుకుంటే.. కొన్ని మండలాల్లోనే తీవ్రత ఎక్కువగా వుందనీ, మిగతా చాలా మండలాలు అసలు కరోనా ప్రభానికి గురి కాలేదనీ వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ, కేంద్రం ‘రెడ్ జోన్లు ఇవీ.. ఆరెంజ్ జోన్లు ఇవీ.. గ్రీన్ జోన్లు ఇవీ..’ అని ప్రకటించాక, రాష్ట్ర ప్రభుత్వాల వాదన చెల్లుతుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ మొత్తం వ్యవహారంపై రేపు సాయంత్రానికే ఓ క్లారిటీ వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
8375 959464I gotta bookmark this website it seems quite useful very beneficial 909019
375474 383478Hey there! Excellent post! Please when all could see a follow up! 949291
769893 697767hi!,I like your writing so significantly! share we maintain up a correspondence extra approximately your post on AOL? I need a specialist on this space to solve my dilemma. Could be that is you! Seeking ahead to peer you. 266988