బాలీవుడ్ లెజెండ్రీ స్టార్ నటుడు రిషి కపూర్ నిన్న ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే. అంతకు ముందు రోజు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందగా ఆ విషయం నుండి తేరుకోకుండానే రిషి కపూర్ మృతి అందరిని తీవ్రంగా కలచి వేసింది. రిషి కపూర్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో ఆలియా భట్ ఫోన్ పట్టుకుని ఉంది. ఫోన్లో వీడియో షూట్ చేస్తున్నట్లుగా ఉంది.
సోషల్ మీడియాలో చావు వద్ద కూడా ఏంటీ ఫోన్ను వదిలి పెట్టవా అంటూ విమర్శలు గుప్పించారు. నీవు ఇప్పటి వరకు ఎన్నో సార్లు అమాయకత్వంతో వ్యవహరించావు. కాని ఈసారి నీవు ఫూలిష్గా ప్రవర్తించావు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆలియా భట్ పై తీవ్ర స్థాయిలో వస్తున్న విమర్శల నేపథ్యంలో కపూర్ ఫ్యామిలీకి చెందిన వారు అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఆ సమయంలో ఆలియా భట్ వీడియో తీయడం కాని.. ఫోన్ చూడటం కాని చేయడం లేదు. రణబీర్ కపూర్ తన తండ్రి రిషి కపూర్ కు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే ఆ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రిషి కపూర్ కూతురు రిద్దిమకు అవకాశం కుగలేదు. దిల్లీలో ఉన్న ఆమెకు రణబీర్ కపూర్ ఫోన్ ద్వారా ఆలియా భట్ వీడియో కాల్ ద్వారా చూపించింది. అంతే తప్ప ఆమె ఫొటోలు తీయడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీని గురించి ఆమెను విమర్శించవద్దంటూ ఆమె సన్నిహితులు సైతం సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు.