రేపల్లె అత్యాచార ఘటన మరువక ముందే విజయనగరం ఉడా కాలనీలో మరో దారుణం జరగింది. ఇద్దరు పిల్లలతో నివాసముంటున్న మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం ఉపాధి నిమిత్తం వచ్చిన మహిళ.. స్థానికంగా ఓ టీస్టాల్లో పని చేస్తోంది. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటి తలుపు కొట్టిన దుండగుడు.. తలుపు తీయగానే బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ స్పందిస్తూ.. ‘ఉడా కాలనీలోని మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. బాధితురాలు తన స్నేహితునితో ఇంట్లో ఉండగా ఇద్దరు యువకులు వచ్చారు. వారిలో ఒకరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించాం. ఘటనలో ప్రమేయం ఉన్న అందరిపైనా కేసు నమోదు చేస్తున్నాం. విచారణ జరుగుతోంద’ని తెలిపారు.
680315 478641I truly enjoy examining on this internet site , it has excellent content material . 517642
722672 998838What might you suggest about your post that you just made a few days ago? Any certain? 677334