రాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు వైకాపాకు దక్కబోతున్నాయి. నాలుగు రాజ్యసభ సీట్ల కోసం ముగ్గురి పేర్లు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యాయి. అందులో మొదటి వ్యక్తి అయోధ్యరామిరెడ్డి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ సోదరుడు ఈయన. 2014లో అయోధ్యరామిరెడ్డి వైకాపా తరపున నరసరావుపేట పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. పైగా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అమరావతిలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే అయన సోదరుడికి ఎంపీ పదవిని ఇచ్చేందుకు పార్టీ సిద్ధం అయ్యింది. ఒక రెండో వ్యక్తిగా కావలి పారిశ్రామిక వేత్త, మాజీ టీడీపీ నేత బీదా మస్తాన్ రావుకు ఇవ్వబోతున్నారు. వైకాపాలో కొత్తగా వచ్చినా, విజయసాయి రెడ్డికి ఈయనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నది. ఈ సాన్నిహిత్యంతోనే జగన్ వద్ద విజయసాయిరెడ్డి లాబీయింగ్ చేసి ఉంటారని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటె, మూడు వ్యక్తిగా జగన్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు, తనతో పాటుగా జైలుకు వెళ్లి వచ్చిన మోపిదేవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారని వినికిడి. గత ఎన్నికల్లో అయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఇప్పుడు మండలిని రద్దు చేస్తున్నారు కాబట్టి ఆయన్ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇకపోతే నాలుగో వ్యక్తి ఎవరు అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. నాలుగో వ్యక్తి కోసం ప్రధానంగా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవికి ఇవ్వాలని వైకాపా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆయన్ను దగ్గర చేసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టొచ్చు అన్నది వైకాపా ఆలోచన. మరి దీనికి మెగాస్టార్ ఒప్పుకుంటాడా చూడాలి.
204142 424120You made some decent factors there. I looked on the internet for the problem and identified most individuals will go along with with your internet site. 928189
149658 198379This really is something I in fact have to try and do a great deal of analysis into, thanks for the post 39116