వచ్చే ఎన్నికల్లో ప్రజలు, రైతులు తరపున పోరాటం చేసేవారికే టికెట్లు ఇస్తామని.. వారు సీనియర్లైనా.. పార్టీ కోసం పని చేయని వారికి టికెట్లు ఇవ్వమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గాంధీభవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేతల కృషి వల్లే వరంగల్ సభ విజయవంతమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కేసీఆర్ వెంట డబ్బు, పోలీసులు ఉంటే.. కాంగ్రెస్ వెనుక ప్రజలు ఉన్నారని అన్నారు.
నేతలు హైదరాబాద్ వదిలి గ్రామాల్లోకి వెళ్లాలని.. ఢిల్లీ వచ్చి బ్యాక్ డోర్ ఎంట్రన్స్ ప్రయత్నాలు కుదరవని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రజలు, రైతుల్లోకి మాత్రమే కాదు.. పిల్లలకు కూడా తెలియాలని సూచించారు. ఇది ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య ఉన్న ఒప్పందమని చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సమస్యలుంటే తనకు చెప్పాలని.. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుందామని.. మీడియా ముందు వద్దని సూచించారు.
947025 413015Hey there! Excellent post! Please when I will see a follow up! 846812